మంచిర్యాల అర్బన్/గర్మిళ్ల, ఆగస్టు 15 : జిల్లాకేంద్రంలో జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్న య్య, కలెక్టర్ భారతీ హోళికేరి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ల చేతుల మీదుగా కేటగిరీల వారీగా ప్రశంసా పత్రాలను అందజేశారు.
బెల్లంపల్లి మండలంలోని లింగాపూర్ జీపీ, చె న్నూర్లోని నారాయణపూర్, హాజీపూర్లోని వేంపల్లి, జన్నారం మండలంలోని దేవునిగూడ గ్రామ పంచాయతీలు ప్రశంసా పత్రాలు అందుకున్నాయి. అలాగే ఉత్తమ మండలాలుగా వేమనపల్లి మండలం, మందమర్రి, హాజీపూర్ నిలిచాయి. బెస్ట్ పాఠశాలలుగా జన్నారం మండలం కిష్టాపూర్ జడ్పీఎస్ఎస్, హాజీపూర్ లోని ముల్కల్ల జడ్పీఎస్ఎస్, బెల్లంపల్లిలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్, మందమర్రి మోడల్ స్కూల్, బెస్ట్ యూఎల్బీలుగా మంచిర్యాల, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, బెస్ట్ ప్లాంటేషన్ ప్రోగ్రాంగా వేమనపల్లి మండలం జిల్లా గ్రామం నిలిచింది.
ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ లెవల్లో వ్యక్తిగత క్రీడల్లో ఈవెంట్స్లో నికాడి ఐశ్వర్య (కబడ్డీ), కొట్టె దివ్య (ఫుట్బాల్), బేర అభిలాష్ (రెజ్లింగ్), ఎస్ గ్రీష్మ (ఫుట్బాల్), పీ అంజి (వాలీబాల్), బీ రాజేశ్ ( వాలీబాల్), జే నాగమ్మ (వుషూ), మద్దూరి కావ్య (క్రాస్కంట్రీ), ఎం శివమహేశ్ (వుషూ), సీహెచ్ కార్తియ (వుషూ) ప్రతిభ చూపి ప్రశంసా పత్రం అందుకున్నారు. ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ లెవల్ సైన్స్ ఈవెంట్స్లో జుమ్మిడి అంజన్న (ఇన్స్పైర్ మనక్-2020, మల్కపల్లి ఆశ్రమ పాఠశాల), డీ స్వర్ణలత (ఇన్స్పైర్ మనక్-2020, బూర్గుపల్లి ఎంపీయూపీఎస్), ఎస్ సాయి శ్రీవల్లి (ఇన్స్పైర్ మనక్-2021, శ్రీచైతన్య హైస్కూల్), బీ వినయ్ కుమార్, టీ అభిలాశ్, బీ అభిలాశ్, ఎం లక్ష్మణ్ (స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ 2021, జడ్పీఎస్ఎస్ వెల్గానూర్), ఎన్ సరిత (జవహార్ లాల్ నెహ్రూ సైన్స్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్ 2021, అన్నారం జడ్పీఎస్ఎస్), ఎం కవిత (జవహార్ లాల్ నెహ్రూ సైన్స్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్ 2022, జడ్పీఎస్ఎస్ సుద్దాల) ప్రశంసా పత్రాలు అందుకున్నారు. క్రీడా రంగంలో ప్రణయ్ కొత్తూరి (అథ్లెటిక్స్ ట్రిఫుల్ జంప్), ఆర్ సుప్రియ (హ్యాండ్బాల్), డీ శ్రీహర్షిణి (తైక్వాండో), పాదం బాలాజీ (యోగా), ఆర్ శ్రీజ (కబడ్డీ), జీ మాన్విత్ (హ్యాండ్బాల్), తులసీ చౌదరి (అథ్లెటిక్స్), రవి కిరణ్ (అథ్లెటిక్స్), ఎక్కువ సార్లు రక్తదానం చేసిన కటకోజుల రామాచారి (మంచిర్యాల), దాసరి అఖిల్ గౌడ్ (బెల్లంపల్లి), మల్యాల శ్రీపతి, ఉత్తమ రైతులు దాడి పెంటయ్య (కాసిపేట), జావెద్ మహ్మద్ (కుందారం), ముడిమడుగుల రమేశ్ (హాజీపూర్), కర్నె అశోక్ (జన్నారం), బెస్ట్ మదర్ అండ్ హెల్తీ బేబీలుగా జోగు రజిని (కొమ్మెర), సునార్కర్ వనిత (రాజీవ్నగర్ తాండూరు), సెగ్గం నవ్య (మామిడిగట్టు), జగడం మహేశ్వరి (మామిడిపల్లి), బెస్ట్ మల్టీపర్పస్ వర్కర్లుగా రూరల్లో వేముల భానయ్య (ఎంపీడబ్ల్యూ నీల్వాయి), మాడె లక్ష్మణ్ (ఎంపీడబ్ల్యూ సంకారం), అర్బన్లో ఎం కోటయ్య (పీహెచ్ వర్కర్ లక్షెట్టిపేట), రాజనరసింహా (పీహెచ్ వర్కర్ బెల్లంపల్లి), బెస్ట్ క్లాసికల్ ఆర్టిస్టులుగా డాక్టర్ కేవీ చిదానంద కుమారి (మంచిర్యాల), అన్నం కల్పన (మంచిర్యాల), లింగంపల్లి రాజలింగు (జన్నారం), బెస్ట్ ఫోక్ ఆర్టిస్టులుగా అంతడుపుల నాగరాజు (మంచిర్యాల), అనుమం డ్ల మధుకర్ (మంచిర్యాల), చల్లూరి కృష్ణ, ఇంటింటా ఇన్నోవేటర్లుగా నిలిచిన చిక్రం రాజు (మల్కపల్లి ఆశ్రమ పాఠశాల కాసిపేట), గొల్లగట్టు వినయ్ (జడ్పీఎస్ఎస్ అన్నారం), సాయి శ్రీవల్లి (శ్రీచైతన్య హైస్కూల్, మంచిర్యాల), ఉగ్గె వివేకానంద (డిప్లొమా విద్యార్థి, గూడెం), ఎం అంజలి (చంద్రవెల్లి జడ్పీఎస్ఎస్), తుంగ రాజశేఖర్ (అన్నారం జడ్పీఎస్ఎస్), ఎన్ రఘు రాం (సుద్దాల జడ్పీఎస్ఎస్), అజాం (మంచిర్యాల), ఎస్ మధుబాబు (మంచిర్యాల) ప్రతిభ చూపి ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు15 : జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వా తంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ వి విధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్ర శంసా పత్రాలను అందజేశారు. అందుకున్న వారిలో వ్యవసా య శాఖ మారుతి, ఏఈవో, బ్యాంకింగ్లో గోపాల కృష్ణ, కలెక్టరేట్లో రవికాంత్, రాజశేఖర్, సహకార శాఖలో సాయి భార్గవ్, ఎస్సీ సంక్షేమశాఖలో శ్రీకాంత్, డీఆర్డీవోలో సుజాత, సూర్య ప్రకాశ్, జిల్లా పంచాయతీ రాజ్ శాఖలో ప్రభాకర్, ఎంపీడీవో గంగాసింగ్, ఎంపీవోమధుకర్, కార్యదర్శి వినోద్ ఉన్నారు.
విద్యాశాఖలో మోహన్రావు, విద్యుత్ శాఖ వాసుదేవ్ డీఈఈ, అగ్నిమాపక శాఖలో సంపత్, మత్స్యశాఖలో శేఖర్, ఫారెస్ట్లో స్వప్న, 108లో విజయ్, చిరంజీవి, హార్టికల్చర్లో ప్రశాంత్, వైద్యశాఖలో సౌమ్య, భాగ్యలక్ష్మి, సత్యవాణి, నాగుబాయి. మిషన్భగీరథలో సురేశ్ ఉన్నారు.
మున్సిపాలిటీలో శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్లో సతీవన్, అనిల్కుమార్, ఆసిఫ్ఖాన్, ప్లానింగ్ శాఖలో రోషిత్, పోలీస్శాఖలో శ్రీనివాస్, రా ణాప్రతాప్, లావణ్య, స్వప్న, చిరంజీవి, రెవెన్యూలో మున్వర్షరీఫ్, పిట్టల సరిత, కిరణ్కుమార్, శ్రీనివాస్, ఆర్అండ్బీలో లక్ష్మీనారాయణ, సర్పంచ్లుగా వాడాయి మాధవి, రౌతు సు జాత, సర్వేఅండ్ల్యాండ్ రికార్డ్సులో శ్రీనివాస్, ట్రాన్స్పోర్ట్స్లో మోహన్గౌడ్, టీఎస్ఆర్టీసీలో విశ్వనాథం, లక్ష్మణ్, మోహన్బాబు, తాలిబ్, పశువైద్యాశాఖలో సాయిలు, మహిళా, శిశు సంక్షేమ శాఖలో సాదియా రుక్సానా, కళావతి, జడ్పీ కార్యాలయంలో సత్యనారాయణ గౌడ్, స్వచ్ఛంద సంస్థల్లో రంజిత్ (బెట్టర్ యూత్ బెట్టర్ సొసైటీ,రెబ్బెన) వారికి అవార్డులు అందజేశారు.
జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ సురేశ్కుమార్, అదనపు కలెక్టర్లు చాహత్బాజ్బాయ్, రాజేశం, ఏఎస్పీలు అచ్చేశ్వర్రావు, భీంరావు, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్రావు, సంతోష్, అజయ్కుమార్, కోవ అరుణ, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్ ఉన్నారు.