ఉట్నూర్, ఆగస్టు 4 : పచ్చని చెట్లతోనే పర్యావరణానికి రక్షణ ఉంటుందని అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రిన్సిపాల్ పావని సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు మొక్కలు నాటేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్, అధ్యాపకులు సుజాత, దినేశ్రెడ్డి, తిరుపతి, సాంబరాజు, సిబ్బంది సాయికృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
నేరడిగొండ, ఆగస్టు 4 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సర్పంచ్ మనీషా సూచించారు. మండలంలోని బంధంరేగడి గ్రామంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృక్ష సంపదతోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో నాయకులు గులాబ్సింగ్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
నార్నూర్, ఆగస్టు 4 : మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకాలు చేపట్టామని సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్ అన్నారు. మండల కేంద్రం నుంచి ఉట్నూర్ వైపునకు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా గుంతల తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత నార్నూర్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. హరితహారంలో భాగంగా మొదటి, రెండో విడుతలో నాటిన మొక్కలు ప్రస్తుతం నీడనిస్తున్నాయని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తుండడంతో మొక్కలు నాటేందుకు గుంత తవ్వకాలు చేపట్టామని తెలిపారు. ఆయన వెంట పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.