నిర్మల్ అర్బన్, జూలై 26 : నిర్మల్ పట్టణంలో నివసిస్తున్న తమకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి ట్రాన్స్జెండర్లు వినతిపత్రం అందించారు.
రేషన్ కార్డులు, విద్య, ఉద్యోగ, వైద్య రంగాల్లో సమాన హక్కులు కల్పించాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్ ఎస్పీ రాజు, నాయకులు ఆమెడ గజేందర్, ట్రాన్స్జెండర్లు బ్యాగరి సిరి, దర్శనం సమీర, డోకూర్ స్వర్ణప్రియ, మనీష, ఆర్తి తదితరులు పాల్గొన్నారు.
మామడ, జూలై 26: పొన్కల్ను మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి పొన్కల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పొన్కల్, పోతారం, అనంతపేట్, కమల్కోట్, కమల్కోట్ తండా, నల్దుర్తి, నల్దుర్తి తండా, ఆదర్శనగర్, టెంబరేని గ్రామాలను కలుపుతూ నూతన మండలం ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, తహసీల్దార్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ హరీశ్కుమార్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, సర్పంచులు భూమేశ్వర్, లక్ష్మీనారాయణ, ముత్యంరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.