నిర్మల్,జూలై 26(నమస్తే తెలంగాణ): జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలతోపాటు జనావాసాల్లోని పరిసర గుంతల్లో నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దీనిని నియంత్రించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ పం చాయతీ సిబ్బందితో ఆయిల్ బాల్స్ తయారు చేయించి నిల్వ ఉన్న నీటిలో వదులుతున్నారు.
ఇటీవల జిల్లా పంచాయతీ అధికారులు, కార్యదర్శులతో రాష్ట్ర కమిషనర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయిల్బాల్స్ తయారు చేయించి నీటి గుంతల్లో వేయించాలని ప్రత్యేకంగా ఆయన ఆదేశించారు. ప్రతి మండల పరిధిలో 2లక్షల బాల్స్ తయారు చేసి అన్ని పంచాయతీల్లో జ నావాసాల్లోని నీటి గుంతల్లో వేసేలా చూడాలన్నారు. దీంతో వారం రోజులుగా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆయిల్ బాల్స్ తయారీ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు.
కార్యదర్శులు తమ కార్యాలయ సిబ్బందితోపాటు అవసరమైతే స్థానికంగా గల మహిళా సంఘాల సహకారాన్ని తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యా ప్తంగా 10,262 ఆయిల్ బాల్స్ తయారు చేసిన సిబ్బంది… ఆయా గ్రామాల్లో నీరు నిలిచిన ప్రాంతాలు, మురుగు నీటి గుం తల్లో వేశారు. దీంతో దోమలకు సంబంధించిన లార్వా నిర్వీ ర్యం అవుతుందని చెబుతున్నారు.
ఫలితంగా దోమలు వృద్ధ్ది చెందవు. ఆయిల్ బాల్స్ నుంచి నూనె బయటకు వచ్చి నీటి ఉపరితలంపై ఒక వలయంగా ఏర్పడుతుంది. తద్వారా దోమలు ఉపరితలం పైకి రాలేవు. లోపలి బాగంలో ఉన్న దోమలు పెట్టిన గుడ్లు, లార్వాకు ఆక్సిజన్ అందక అవి నశించిపోతాయి.
ఆయిల్ బాల్స్ను చాలా సులభంగా తయారు చేయవచ్చు. అతి తక్కువ ఖర్చుతో తయారు చేసే ఈ ఆయిల్ బాల్స్ వల్ల ప్రజల కు మేలు జరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ విధానా న్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది. వీటి తయారీకి కట్టెల కోత యంత్రాల వద్ద దొరికే పొట్టు (రంపపు పొట్టు, రైస్ మిల్లుల్లో దొరికే తవుడు, ఇసుక, సున్నం, వాహనాల్లో వాడి పారేసే ఇం జిన్ ఆయిల్, పాత తట్టు సంచి అవసరమవుతాయి.
రంపపు పొడి, ఇసుక, సున్నం మిశ్రమాన్ని బట్టలో లేదా సంచిలో కట్టి బాల్స్ మాదిరిగా తయారు చేయాలి. ఇలా తయారు చేసిన బా ల్స్ ను ఆయిల్ ఇంజిన్లో కొన్ని గంటల పాటు నానబెట్టాలి. ఆయిల్లో నానిన బాల్స్ను నీటి గుంతల్లో వేస్తే దోమలు వృద్ధి చెందవు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కా ర్యక్రమం ద్వారా పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రతి గ్రామంలో ఎప్పటికప్పుడు మురుగు కాలువలను శుభ్రం చేయడంతోపాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల దోమల బెడద తగ్గింది.
పల్లె ప్రగతిలో భాగంగా గుంతలు, పాడుబడ్డ బావులను పూడ్చడం, శిథిలావస్థలో ఉన్న పురాతన ఇండ్లను కూల్చివేయడం, విరివిగా మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలు చేపట్టడంతో పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో అలరారుతున్నాయి. దీంతో గ్రామాల్లో గతం కంటే దోమల సంఖ్య బాగా తగ్గింది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో ఆయిల్ బాల్స్ తయా రు చేయించాలని పంచాయతీ కా ర్యదర్శులకు ఆదేశాలిచ్చాం. భైం సా మండలంలో ఇప్పటి వరకు దాదాపు 2 వేల ఆయిల్ బాల్స్ త యారు చేయించి, నిల్వ ఉన్న నీటిలో వదలడం జరిగింది.
దోమల నివారణకు ఇవి బాగా పనిచేస్తున్నాయి. తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేయవచ్చు. దోమల వృద్ధిని నివారించడం ద్వారా డెంగీ, టైఫాయిడ్, మలేరియా, పైలేరియా ,తదితర జ్వరాల నుంచి ప్రజలను కాపాడవచ్చు.
-ఏ.గంగాధర్, ఎంపీడీవో, భైంసా