బోథ్, జూన్ 24 : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బోథ్ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్, సహకార సంఘాల ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వానకాలం పంట సీజన్ మొదలైనా రైతులు నష్టపోకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ జొన్నలను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నా రు.
మద్దతు ధర క్వింటాలుకు రూ.2,738 చెల్లిం చి, కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల వారీగా రైతులు జొన్నలు తీసుకువచ్చి, అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, సహకార సంఘం చైర్మన్ కే ప్రశాంత్, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎన్ జగన్మోహన్రెడ్డి, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, సర్పంచ్ సురేందర్ యాదవ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, ఆత్మ సొసైటీ చైర్మన్ ఎం సుభాష్, డీ నారాయణరెడ్డి, ఏ ప్రశాంత్, బుచ్చన్న, రవీందర్ యాదవ్, కేంద్రం ఇన్చార్జి బారె భూషణ్, కార్యదర్శి రాము, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యు లు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.