భూసారం పెంపొందించి, రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించేందుకు పచ్చిరొట్ట ఎరువులు ఎంతో దోహదపడుతాయి. రసాయనిక ఎరువులను విపరీతంగా వినియోగిస్తే భూసారం దెబ్బతిని పంటలు సూక్ష్మ, స్థూల పోషకాల లోపాలు, చీడపీడల ఉధృతికి లోనవుతాయి. పచ్చిరొట్టయిన జనుము, జీలుగ విత్తనాలు దుక్కిలో వేసి దున్నితే భూసారం పెరగడమే కాకుండా మంచి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
– మంచిర్యాల (నమస్తే తెలంగాణ)/ సోన్, జూన్ 21
అన్నదాతలు వానకాలం సాగుపై దృష్టి సారించారు. ఇందుకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను జిల్లాకు కేటాయించారు. జీలుగ వెయ్యి, జనుము 7,691 క్వింటాళ్ల చొప్పున కలిపి జిల్లా వ్యాప్తంగా 8,691 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచా రు. బెల్లంపల్లి, భీమారం, చెన్నూర్, జైపూర్ మండలాలకు 50 క్వింటాళ్లు, లక్షెట్టిపేట, జన్నారానికి 100 క్వింటాళ్లు, దండేపల్లికి 400, హాజీపూర్కు 200 చొప్పున జిల్లాకు వెయ్యి క్వింటాళ్ల జీలుగ విత్తనాలను మంజూరు చేశారు. బెల్లంపల్లికి 250, భీమారం 200, భీమిని 100, చెన్నూర్ 450, దండేపల్లి 2,350, హాజీపూర్ 450, జైపూర్ 300, జన్నారం 1100, కన్నెపల్లి 200, కాసిపేట 50, కోటపల్లి 100, లక్షెట్టిపేట 1300, మంచిర్యాల 200, మందమర్రి 150, నెన్నెల 200, తాండూర్ 241, వేమనపల్లికి 50 క్వింటాళ్ల చొప్పున విత్తనాలను కేటాయించారు.
సాధారణంగా రైతులు పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువులతో పాటు చెరువు మట్టి, వివిధ పంటల అవశేషాలను సేంద్రియ ఎరువులుగా వినియోగిస్తు న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీటి లభ్యత తక్కువ, ధర కూడా ఎక్కువగా ఉంటున్నది. దీంతో అంతే ఫలితాన్నిచ్చే సులభంగా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ పచ్చిరొట్ట ఎరువులను వినియోగిం చాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నా రు. జీలుగ, జనుము, పెసర, పిల్లి పెసర, ైగ్లెరిసిడియా వంటి పంటలను రైతులు పండించి నేలలో కలియ దున్నితే మొక్కలకు ఎరువులుగా ఉపయోగపడుతాయని పేర్కొంటున్నారు.
ఈ సేంద్రి య ఎరువుల ద్వారా మొక్కలకు అవసరమైన ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి మరో 13 రకాల పోషకాలు అందుబాటులో ఉంటాయని వివరిస్తున్నారు. దీంతో నేల ఆరో గ్యంతో పాటు పంట దిగుబడి వస్తుందని అన్నదాతలకు అవగాహన కల్పిస్తు న్నారు. ఎకరంలో దాదాపు 5 నుంచి 12 టన్నుల పచ్చిరొట్ట నేలకు అందించేందుకు పుష్క లంగా అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఒక ఎకరంలో జనుమును నేలలో కలి యదున్నితే 5 నుంచి 12 టన్నుల పచ్చిరొట్ట ఎరువు ద్వారా సుమారు 53 కిలోల నత్రజని నేలకు అందుతుంది. దీంతో 45 -50 కిలోల ఎరువును ఆదా చేసుకోవచ్చని వివరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నేలలో పెద్ద మొ త్తంలో సేంద్రియ కర్బనం అందుబాటులోకి వస్తుందని, సూక్ష్మజీవులు వృద్ధి చెంది ఇతర పోషకాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు.
పచ్చిరొట్ట ఎరువులను భూమికి రెండు విధాలుగా అందించవ చ్చు. జనుము, జీలుగ, పిల్లిపెసర, ఉలవ, పెసర, అలసంద పచ్చిరొట్ట పైర్ల విత్తనాలను పొలంలో వెదజల్లాలి. అవి పెరిగిన తర్వాత 50 శాతం పూత దశలో (45-60 రోజుల వయస్సు) అదేపొలంలో అక్కడికక్కడే భూమిలోకి కలియదున్నాలి. కుళ్లిన తర్వాత ప్రధాన పంట వేసుకోవాలి. వేప, తంగేడు, కానుగ, ైగ్లెరిసిడియా పచ్చిరొట్ట చెట్ల ఆకులు, కొమ్మలు బయటి నుంచి సేకరించి పొలంలో వేసి కలియదున్ని మురగనివ్వాలి.
జీలుగ : క్షార గుణం గల చౌడు భూముల్లో, వరి పండించే భూముల్లో పచ్చిరొట్ట వేస్తారు. ఎకరానికి 20 కిలోల విత్తనం చల్లడంతో పొలం అంతా సమంగా పెరుగుతుంది. దీనిని పూత దశలో కలియదున్నడంతో ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఎకరానికి 30-32 కిలోల నత్రజనిని అందిస్తాయి. ఈ మొక్కలో 3.5 శాతం నత్రజని, 0.6 శాతం భాస్వరం, 1.2 శాతం పొటాష్ ఉంటాయి.
జనుము : అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. పచ్చిరొట్టగా, పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. ఎకరానికి 9.2 నుంచి 14 కిలోల విత్తనం చల్లుకోవాలి. ఈ పైర్లు ఎకరానికి 5.2 నుంచి 6 టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. ఇందులో 2.3 శాతం నత్రజని, 0.5 శాతం భాస్వరం, 1.8 శాతం పొటాష్ ఉంటాయి. పెసర : ఈ పైరును తేలిక, బరువైన నేలల్లో సాగు చేయవచ్చు. దీన్ని ఆహారంగా, పచ్చిరొట్ట ఎరువుగా, పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. చౌడు భూముల్లో సాగుకు పనికిరాదు. ఎకరానికి 12 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ పైరు ఎకరానికి 15.2 కిలోల నత్రజనిని మొక్కలకు అందిస్తాయి.
వేప : కొమ్మలు, ఆకులను బయట నుంచి తీసుకొచ్చి పొలంలో కలియదున్ని అక్కడే మురగనివ్వాలి. దీంతో అనేక పోషకాలు పంటలకు అందుతాయి. పురుగు మందుగా కూడా ఉపయోగపడుతుంది. ఇందులో 2-5 శాతం నత్రజని, 0.5-1 శాతం భాస్వరం, 2.3 శాతం పొటాష్ ఉంటాయి.
ైగ్లెరిసిడియా : పొడవైన కొమ్మలు గట్ల మీద, బావుల దగ్గర నాటాలి. కొమ్మలు, ఆకులను బయట నుంచి తీసుకొచ్చి పొలంలో కలియదున్ని మురగనివ్వాలి. ఒక్కో చెట్టుకు ఏడాదికి 100- 125 కిలోల పచ్చిరొట్టనిస్తుంది. ఇందులో 2-9 శాతం నత్రజని, 0.5 శాతం భాస్వరం, 2.8 శాతం పొటాష్ ఉంటాయి. గానుగ, జిల్లేడు, నేల తంగేడు, కొండ మిరప మొదలైన వాటిని పచ్చి ఆకు ఎరువులుగా వాడవచ్చు.
రైతులు ప్రధాన పంట వేసే ముందు పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయడంతో భూమి సారవంతమవుతుంది. భూమిలో సేంద్రియ కర్బనం, నత్రజని అందడంతో రసాయన ఎరువుల వాడకం తగ్గించవచ్చు. వేసవి దుక్కుల తర్వాత విత్తనాలు వేసి పూతకు రావడానికి ముందు పొలంలో కలియదున్నుకుంటే నేలకు మంచిది. రైతులు పట్టాపాస్ పుస్తకం, ఆధార్కార్డుతో వచ్చి సబ్సిడీపై విత్తనాలు తీసుకోవాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులను వినియోగించడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు.
– టీ మహేందర్, మండల వ్యవసాయశాఖ అధికారి, చెన్నూర్
వరి సాగు చేసే రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం బ్యాగు ధర రూ. 1828 కాగా.. సబ్సిడీ కింద రూ. 665కే అందిస్తున్నాం. కొనుగోలు చేసిన రైతులు పచ్చిరొట్ట విత్తనాలను పొలంలో దుక్కులు దున్ని వేసుకోవాలి. 40 రోజుల తర్వాత భూమిలో కలియదున్నడం ద్వారా భూసారం పెరుగుతుంది. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించేందుకే పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేస్తున్నాం.
– వసంత్రావు, ఏవో, నిర్మల్ రూరల్
విత్తనాలు పూర్తి ధర రాయితీ చెల్లించాల్సింది
జీలుగ 6,325 4,111 2,214
జనుము 8,325 5,411 2,914
పిల్లి పెసర 8,800 5,700 3,100