పట్టణాలు, గ్రామాల్లో పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇం దులో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వా ములయ్యారు. ఆయాచోట్ల ర్యాలీలు నిర్వహిం చారు. పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామసభలు ఏర్పాటు చేశారు. చేపట్టిన, చేపట్టనున్న పనులపై చర్చించారు. పలు సమస్యలు పరిష్కరించారు. వివిధ శాఖల సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నిర్మల్ అర్బన్, జూన్ 3 : పట్టణ ప్రగతి కార్యక్ర మంతో సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంద ని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పేర్కొ న్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విద్యానగ ర్, గాంధీచౌక్, బంగల్పేట్, బర్కత్పురా, ద్యాగ వాడ కాలనీల్లో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ప్రారం భించారు. వార్డుల్లో తిరుగుతూ జేసీబీ, మున్సిపల్ సిబ్బందితో పారిశుధ్య పనులు చేయించారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ మురారీ, కౌన్సిలర్ అబ్దుల్ మతీన్, తదితరులు పాల్గొన్నారు.
భైంసా, జూన్ 3 : వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్న ట్లు మున్సిపల్ కమిషనర్ ఎంఏ అలీం పేర్కొన్నా రు. శుక్రవారం 1, 12వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంతో సమ స్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. రెండు వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వ హించారు. మున్సిపల్ కమిషనర్ ఎంఏ అలీం, ఏఈ నాగేశ్వర్ రావు, కౌన్సిలర్ ఫయాజుల్లాఖాన్, కౌన్సిలర్ చందులాల్ తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్, జూన్ 3 : ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శాంతినగర్ కాలనీలో ఆయ న ప్రారంభించారు. అనంతరం కాలనీ ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్, వార్డు ప్రత్యేక అధికారి రాజేం ద్రప్రసాద్, నాయకులు నాగేందర్రావు, రాజేంద ర్, గంగనర్సయ్య, మెప్మా సిబ్బంది, ఆశ వర్కర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, జూన్ 3 : సూర్జాపూర్లో ప్రత్యేకాధికారి సీడీపీవో సరిత పల్లె ప్రగతి కార్యక్ర మాన్ని ప్రారంభించారు. కొత్తపేట్, బావాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఏపీవో సునంద గ్రామసభలు నిర్వహించారు. సమస్యలపై చర్చించారు. ప్రగతి నివేదికను చదివి వినిపించారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. సర్పంచ్లు, కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దస్తురాబాద్, జూన్ 3 : మండల కేంద్రంతో పాటు అన్నిగ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వ హించారు. పంచాయతీ కార్యదర్శులు సీఎం కేసీఆర్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. గతంలో చేసిన పనులు, ప్రస్తుతం చేయాల్సిన పనులను వివరించారు. అపరిశుభ్రంగా ఉన్న నీటి ని తొలగించి, శుభ్రతపై అవగాహన కల్పించారు. ఎంపీపీ సింగరి కిషన్, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీ వో వెంకటేశ్వర్లు, ఎంపీవో అనిల్ కుమార్, ప్రత్యేక అధికారులు, సర్పంచ్లు నిమ్మతోట రాజమణి, ఒడిసె పోశవ్వ, నిరోష, సుజాత, లక్ష్మి, ముష్కే అంజన్న, దుర్గం శంకర్, అప్పని ప్రభాకర్, సురేశ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
కుంటాల, జూన్ 3 : పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా అన్నిగ్రామాల్లో గ్రామసభలు నిర్వ హించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లా డారు. ప్రజల కనీస అవసరాలను గుర్తించి వాటిని తీర్చేలా అధికారులు పని చేయాలన్నారు. వ్యక్తి గత శుభ్రత, పారిశుధ్య పనులు మొక్కల పెంప కం, చెత్త సేకరణపై చర్చించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.
లోకేశ్వరం, జూన్ 3 : గ్రామాల్లో సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. పల్లె ప్రగతిలో చేపట్టనున్న పనులు గుర్తించారు. గ్రామాలను శుభ్రంగా ఉంచడంతో పాటు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్రత్యేకాధికారి క్రాంతికుమార్, ఎంపీపీ లలితా భోజన్న, జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీడీవో దేవేందర్రెడ్డి, ఎంపీవో సాల్మాన్ రాజ్, సూపరిం టెండెంట్ ఏవీ రమేశ్, సర్పంచ్లు ఎర్రవ్వ, దిగం బర్ సౌజన్య కపిల్, భోజవ్వ గంగాధర్, ముత్తా గౌడ్, సాలాయి నరేశ్, రమణారెడ్డి, సంగెం నర్సన్న, మంద శారదా భాస్కర్, రజిత సాయన్న, ఎంపీటీసీలు, కదం దత్తు, సాయారెడ్డి, తోట ఇంద్ర గంగాధర్, లోలం జీవన్, జై సాగర్ రావు, కార్యదర్శులు సుప్రియ, సాయిరాజ్ భోజన్న, సాయి ప్రసాద్, గాయత్రి, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు దీప, శ్రీలక్ష్మి, శారద, సుజాత తదిత రులు పాల్గొన్నారు. కాగా బిలోల, హవర్గ గ్రామా ల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మండల స్పెషల్ అధికారి క్రాంతి కుమార్ పరిశీలించారు. మొక్కలు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల ని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కదం భుజంగ్రావు, సూపరింటెండెంట్ రమేశ్ పాల్గొన్నారు.
ముథోల్, జూన్ 3 : అన్ని గ్రామపంచాయ తీల్లో గ్రామసభలు ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికే సర్కారు పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందని పేర్కొ న్నారు. ప్రతి గ్రామంలో ర్యాలీలు నిర్వహించారు. ఎంపీడీవో సురేశ్ బాబు, ఎంపీవో అమీర్ ఖాన్ సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
సోన్, జూన్ 3 : సోన్ మండలం జాఫ్రాపూర్, సిద్ధ్దులకుంట గ్రామాల్లో పల్లె ప్రగతి ప్రారంభ మైంది. జాఫ్రాపూర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ జీవన్రెడ్డి మాట్లాడుతూ సమ స్యల పరిష్కారానికి సర్కారు కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిం చారు. కాలనీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ మానస హరీశ్రెడ్డి, ఎంపీడీవో సాయిరాం, సర్పం చ్లు సునీతా ప్రకాశ్రెడ్డి, మహిపాల్రెడ్డి, ఎంపీవో రమేశ్రెడ్డి, ఏపీవో మంజుల పాల్గొన్నారు.
తానూర్, జూన్ 3 : తానూర్తోపాటు అన్ని గ్రామాల్లో సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, ఎంపీవో మోహన్సింగ్ ఎల్వత్ గ్రామాన్ని సంద ర్శించారు. మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షు డు తాడేవార్ విఠల్, ఉప సర్పంచ్ నయీం, పంచాయతీ కార్యదర్శి జాలంసింగ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
కడెం, జూన్ 3 : మండలంలోని 28 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి ప్రారంభమైంది. సిబ్బంది వీధులను శుభ్రం చేశారు. గ్రామసభలు నిర్వహించారు. గ్రామాల్లో అవసరమైన పనులపై తీర్మానం చేశారు. కొండుకూర్, నచ్చన్ఎల్లాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. సర్పంచ్లు గోళ్ల వేణుగోపాల్, బొడ్డు గంగన్న, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.