తానూర్, మే 28 : అన్ని వర్గాలకు ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని ఏల్వత్ గ్రామంలో రూ 5. 50 లక్షలతో బుద్ధవిహార్ నిర్మాణ పనులు, ముథోల్ నుంచి ఏల్వత్ రోడ్కు రూ .48 లక్షలతో కల్వర్టు నిర్మాణ పనులకు శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే విఠల్రెడ్డిని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాతే గ్రా మాల్లో రవాణా వ్యవస్థ మెరుగైందన్నారు.
గ్రామా ల్లో అంతర్గత రోడ్లు బాగుపడ్డాయన్నారు. రాష్ట్రం లో అమలవుతున్న సంక్షేమ పథకాలతో దేశమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతిసురేశ్ కమలాకర్, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావ్ పటేల్, ఆత్మ చైర్మన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కానుగంటి పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, మండల కోఆప్షన్ సభ్యుడు గో వింద్ పటేల్, నాయకులు చంద్రశేఖర్, భీంపవా ర్, నంద్గావ్ సర్పంచ్ అబ్దుల్ఘనీ పాల్గొన్నారు.
భైంసా, మే28 : బాధితులు మెరుగైన వైద్య చికిత్స పొందేందుకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా పలువురికి మంజూరైన చెక్కులను విశ్రాంతి భవనంలో శనివారం పంపిణీ చేశారు. షేక్ మొబిన్కు రూ.లక్ష, సయ్యద్ ఫారూఖ్కు రూ. 55 వేలు, అబ్దుల్ జబ్బార్కు రూ. 50 వేలు, వహీదా బేగంకు రూ. 24 వేలు, అబ్దుల్ జలీల్కు రూ. 40 వేలు, మీర్జా మహ్మద్ బేగ్కు రూ. 60 వేలు, రేష్మా బేగంకు రూ. 18,500 విలువైన చెక్కులు మంజూరయ్యాయి. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిఫ్, ఆళా, తోట రాము ఉన్నారు.