బేల, మే 28 : విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. విద్యావిధానంలో మార్పునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతగా బేల మండలం సైద్పూర్, బాది, సిర్సన్నలోని పాఠశాలల్లో పలు అభివృద్ధి పనలకు శనివారం భూమి పూజ చేశారు. బాది పాఠశాలకు రూ. 9.51 లక్షలు, సైద్పూర్ పాఠశాలలకు రూ. 6.53 లక్షలు, సిర్సన్న హైస్కూల్ కు రూ.49. 84 లక్షలు అభివద్ధి పనులకు మంజూరు చేశారు.
ఆయా పాఠశాలల్లో గదుల మరమ్మతులు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు నిధులు వెచ్చించనున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పేద పిల్లలు రాణించాలంటే చదువు ముఖ్యమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కళ్యాం ప్రమోద్ రెడ్డి, నాయకులు సతీశ్ పవార్, మెట్టు ప్రహ్లాద్, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, దేవన్న, జక్కుల మధుకర్, బండి సుదర్శన్, దంతేల వినోద్, దీపక్గౌడ్, సర్పంచ్లు గోధూరి భూమన్న, రాథోడ్ సుమన్బాయి, లక్ష్మీబాయి, మండల ప్రత్యేకాధికారి శంకర్, ఎంపీడీవో భగత్ రవీందర్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, మే 28: యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని రామకృష్ణసేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి యోగా శిక్షణా శిబిరంలో పాల్గొని రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన వారిని శనివారం సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్నతనం నుంచే క్రీడల్లో పాల్గొనడం ద్వారా వారిలో మానసిక ఆనందంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, రామకృష్ణ సేవాసమితి నాయకులు ఆరె భూమన్న, కోరెడ్డి లెనిన్, లస్మయ్య, కోటేశ్వర్రావు, లంక హన్మాండ్లు, సంతోష్ పాల్గొన్నారు.