బజార్హత్నూర్, మే23: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజూ ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. బజార్హత్నూర్ ఆదర్శ పాఠశాల సెంటర్లో 232 మంది విద్యార్థులకు 231 మంది పరీక్ష రాశారు. జాతర్ల పాఠశాలలో 133 మంది విద్యార్థులకు 130 మంది హాజరయ్యారు. పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షలను విద్యాధికారులు పర్యవేక్షించారు.
గుడిహత్నూర్, మే 23 : గుడిహత్నూర్ ఆదర్శ, తోషం జిల్లా పరిషత్, ఆశ్రమోన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మూడు కేంద్రాల్లో 457 మంది విద్యార్థులకు 454 మంది హాజరయ్యారు. సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్లుగా ప్రధానోపాధ్యాయుడు పీ కిషన్, కనక అభిమాన్, సరోజబాయి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లుగా గంగన్న, శ్రీనివాస్ వ్యవహరించారని ఎంఈవో ఆర్ నారాయణ తెలిపారు.
నేరడిగొండ, మే 23: నేరడిగొండ జడ్పీ హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, లఖంపూర్ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 383 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఇద్దరు గైర్హాజరైనట్లు సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్లు జగదీశ్వర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
తలమడుగు మే 23: తలమడుగు ఉన్నత పాఠశాలలో 235 విద్యార్థులకు 232 మంది, బరంపూర్లో 166 మందికి 164 మంది పరీక్షలు రాశారు. సెంటర్లను తహసీల్దార్ ఇమ్రాన్, ఎంఈవో నారాయణ, ఎస్ఐ ప్రవళిక పరిశీలించారు. పరీక్షలను సీఎస్ రాజేశ్వర్ రెడ్డి, డిపార్ట్మెంటల్ అధికారి వెంకట్రావ్ పర్యవేక్షించారు.
ఇంద్రవెల్లి, మే23: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన (ఏ) పరీక్షా కేంద్రంలో 147మంది, (బీ) పరీక్షా కేంద్రంలో 150 మంది, ఇంద్రవెల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 197 మంది, కేస్లాపూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 181 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. సెంటర్లలో సకల సౌకర్యాలు కల్పించారు.
నార్నూర్,మే 23 : నార్నూర్, గాదిగూడ మండలాల్లోని తెలంగాణ ఆదర్శ, తాడిహత్నూర్ జిల్లా పరిషత్, గాదిగూడలోని గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలుర పాఠశాలలో విద్యార్థులు పరీక్షలు రాశారు. మూడు కేంద్రాల్లో 580 మంది విద్యార్థులకు 567 మంది హాజరైనట్లు ఎంఈవో రాపెల్లి ఆశన్న తెలిపారు.
బేల, మే 23: బేల జడ్పీఎస్ఎస్తో పాటు బాలుర ఆశ్రమ, సాంగిడి ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు సెంటర్లలో 394 మంది విద్యార్థులకు 394 మంది పరీక్షలకు హాజరయ్యారని డీఈవో శంశోద్దీన్ తెలిపారు.
బేల జడ్పీఎస్ఎస్, ఆశ్రమ బాలుర పాఠశాలలోని సెంటర్లను జైనథ్ సర్కిల్ సీఐ కోల నరేశ్ కుమార్ తనిఖీ చేశారు. కల్పించిన మౌలిక వసతులపై ఆరా తీశారు. అలాగే సాంగిడి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తహసీల్దార్ బడాల రాంరెడ్డి తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని సిబ్బంది, నిర్వాహకులకు సూచించారు. ఇక్కడ బేల ఎస్ఐ కృష్ణకుమార్ ఉన్నారు.
బోథ్, మే 23 :మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, ఎస్సీ గురుకులం, కౌఠ, సొనాలలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకున్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జైనథ్, మే 23 : మండలంలో ఏర్పాటు చేసిన ఐదు పరీక్షా కేంద్రాల్లో 661 మంది విద్యార్థులకు 11 మంది గైర్హాజరయ్యారు. జైనథ్లోని పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్ రాఘవేంద్రరావు తనిఖీ చేశారు.
భీంపూర్, మే 23 : మండలంలోని అందర్బంద్ ఆశ్రమోన్నత పాఠశాలలో 149 మంది పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాన్ని ఎంఈవో శ్రీకాంత్ తనిఖీ చేశారు. పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
తాంసి, మే 23: మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్లో 156 మంది విద్యార్థులకు 154 మంది, కప్పర్ల జడ్పీహెచ్ఎస్లో 145 మందికి 144 మంది పదో తరగతి తెలుగు పరీక్ష రాసినట్లు ఎంఈవో శ్రీకాంత్ తెలిపారు.
ఉట్నూర్, మే 23 : మండల కేంద్రంలో పూలాజీబాబా విద్యా సంస్థ, బాలికల ఆశ్రమ, బాలుర జిల్లా పరిషత్, క్రీడా, సెయింట్పాల్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో 971 మంది విద్యార్థులకు 15 మంది గైర్హాజరు కాగా 956 మంది పదో తరగతి తెలుగు పరీక్ష రాశారు. గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాలను ఎంఈవో శ్రీనివాస్, ఎస్ఐ భరత్ కుమార్ తనిఖీ చేశారు.