ఎదులాపురం, మే 21 : ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా దూరపాంత విద్యా ర్థులు పరీక్షా కేంద్రాలకు ముందస్తుగా చేరుకు నేందుకు బస్సుల సమయాలను రీషెడ్యూల్ చేయాలని సూచించారు. తాగునీరు. ఫ్యాన్లు, విద్యుత్ లైట్లు, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలన్నారు.
ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా పరీక్ష లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లా డుతూ పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కేంద్రాలలో 11,256 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. టెలీకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, డీఈవో ప్రణీత పాల్గొన్నారు.
యూడైస్ ప్రోగ్రాం కింద విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, మౌలిక సదుపాయాల వివరాలను ఈ నెల 28వ తేదీలోగా అప్లోడ్ చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సమావేశ మందిరంలో విద్యా, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమం, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు అప్లోడ్ చేయాలని సూచించారు.
యూడైస్లో నమోదు చేస్తున్న వివరాలు మన ఊరు- మన బడి కార్యక్రమం కింద చేపడు తున్న వాటికి వ్యత్యాసం రాకుండా ఉండాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలోని 1438 పాఠశాలల్లోని విద్యార్థులు, పాఠశాలలు, బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు, సౌకర్యా లు మరుగుదొడ్లు ప్రహరీ, తాగునీరు, కిచెన్షెడ్ వివరాలను సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సమావేశంలో డీఈవో ప్రణీత, సెక్టోరియల్ అధికారి నారాయణ, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీత కుమారి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.