శ్రీరాంపూర్/మందమర్రి రూరల్/గోదావరిఖని/ యైటింక్లయిన్ కాలనీ/రామగిరి, మే 19: రానున్న వర్షాకాలం లో ఎదురయ్యే సమస్యలను ముందే గుర్తించి, ఉత్పత్తికి ఆటంకం కలుగకుం డా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్లు చంద్రశేఖర్, ఎన్ బలరాం, సత్యనారాయ ణ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జీఎంలతో ఓసీపీల్లో ఉ త్పత్తి, వానకాల సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జీఎంలు ఓసీ పీ సమస్యలు డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లా రు.
ఓసీపీల్లో నీటిని నిల్వ ఉంచకుం డా, పంపు ల ద్వారా ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. ఇందుకోసం తగిన యంత్ర సా మగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఉత్పత్తి లక్ష్యాలను అ ధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుకోవాలని జీఎంలకు సూచించారు.
శ్రీరాంపూర్ ఏరియా నుంచి జీఎం సంజీవరెడ్డి, ఈఈ కుమా ర్, ఏజెంట్ విజయభాస్కర్రెడ్డి, ప్రాజె క్టు ఆఫీసర్ పురుషోత్తంరెడ్డి, రాజేశ్వర్రె డ్డి, డీవైజీఎంలు చంద్రశేఖర్రెడ్డి, శివరా వు, చిరంజీవులు, ఈ ఈ రమేశ్, మందమర్రి ఏరియాలో ఏజీ ఎం ఈఅండ్ఎం రాంమూర్తి, కేకే ఓసీ ప్రాజెక్ట్ అధికారి రమేశ్, ఆర్కే వోసీ ప్రాజెక్ట్ అధికారి మ ధుసూదన్, డీజీఎం ఐఈడీ రాజన్న, ఆర్జీ 3 ఏరియాలో జీఎం మనోహర్ ఇం జినీర్ ఎలీషా, పీవో రాధాకృష్ణ, పీఈ వెంకటేశ్వర రావు, డీజీఎం చంద్రశేఖర్, ఆర్జీ-2 ఏరియాలో జీఎం టీ. వెంకటేశ్వర్రావు, ఎస్వోటూ జీఎం సాంబయ్య, ఓసీపీ-3 పీవో జీ. మోహన్ రెడ్డి, ఏరి యా ఇంజినీర్ రాధాకృష్ణారావు, ఏరి యా రక్షణాధికారి జీఎ ల్ ప్రసాద్, పీఈ దుర్గాప్రసాద్, ఐఈడీ డీజీఎం ము రళీకృష్ణ, క్వాలిటీ డిప్యూటీ మేనేజర్ వెం కటమోహన్ పాల్గొన్నారు.
జీఎం మల్లెల సుబ్బారావు, ఏజీఎం రామలింగం, కేటీ కే ఓసీ-2 పీవో జాన్ ఆనంద్, ఏరియా అధికార ప్రతినిధి తుకారం, ఇతర డిపార్టుమెంట్ల అధికారులు పాల్గొన్నారు.