ఇచ్చోడ, మే 19 : వివిధ శిక్షణల ద్వారా ఉపాధి మార్గాలను ఎంచుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి ఎంపీపీ నిమ్మల ప్రీతమ్రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో బ్యూటిషన్, ఎంబ్రాయిడరీ శిక్షణ పూర్తి చేసుకున్న 60 మంది లబ్ధిదారులకు గురువారం సర్పంచ్ చౌహాన్ సునీతతో కలిసి యోగ్యత పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సులను గృహిణులు, యువతీలు వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి వైవు అడుగులు వేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధల ద్వారా శిక్షణ నేర్చుకోవడం వలన ఉపాధితో పాటు ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లోక శిరీశ్రెడ్డి, జన శిక్షణ సంస్థాన్ ఇన్చార్జి సంతోష్, శిక్షణ టీచర్ నీరజ, షాహీదా, ఆస్మా అంజుం, తదితరులు పాల్గొన్నారు.