నార్నూర్, మే 16 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్కు దీటుగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ పాఠశాలలో సోమవారం భూమి పూజ చేసి, పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మండలంలో మొదటి విడుత కింద 18 పాఠశాలలు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం పాఠశాలల మరమ్మతులకు సుమారు రూ.2 కోట్లు మంజూరు చేసిందన్నారు.
ఈ నిధులతో మెరుగైన వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, డీఎల్పీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవో రమేశ్, ఎంఈవో రాపెల్లి ఆశన్న, ఐటీడీఏ ఏఈ రాథోడ్ సునీల్, సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, ఉప సర్పంచ్ మహేందర్, ప్రధానోపాధ్యాయులు హరిచంద్, రాజ్కుమార్, ఎస్ఎంసీ చైర్మన్లు లక్ష్మి, రాజు, డైరెక్టర్ దుర్గే కాంతారావ్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేశ్, పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్ఖాన్, రాథోడ్ శివాజీ, హైమద్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.