బేల, మే16 : వ్యవసాయాధికారులు చెప్పిన పంటలే రైతులు వేసుకోవాలని వ్యవసాయ విస్తరణ ఆధికారి సాయి కీర్తన సూచించారు. మండలంలోని బాది గ్రామంలో పంట పొలాల్లో మట్టి నమునాలపై అవగాహన కల్పించారు. పలువురు భూముల్లో మట్టి నమూనాలు తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పత్తి విత్తనాలు కొనేటప్పుడు తప్పక రసీదులు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే వ్యవసాయాధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రతి ఒక్క రైతు పీఎం కీసాన్ సామ్మాన్ నిధి కోసం తప్పక కేవైసీలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ సిడాం లక్ష్మీబాయి, ఉప సర్పంచ్ దంతల వినోద్, రైతులు మోతీరాం, ఆవుల మహేందర్, సామ జైపాల్రెడ్డి, జోడే గణేశ్, ప్రహ్లాద్, నాగోసే వినోద్, ఎస్కే బహదూర్ పాల్గొన్నారు.
బోథ్, మే 16 : రైతులు తమ పంట పొలాల్లోని మట్టిని తీసుకొచ్చి భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి శ్యాంసుందర్రెడ్డి సూచించారు. మండలంలోని గొల్లాపూర్, వజ్జర్ గ్రామాల్లో రైతులకు భూసార పరీక్షలపై సోమవా రం అవగాహన కల్పించారు. పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణను వివరించారు. భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులు వాడితే పంట దిగుబడి బాగా వస్తుందన్నారు. ఏఈవోలు జక్కుల సంతోష్, కే శ్యామ్, అర్షాజూహీ ఆయా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు.
గుడిహత్నూర్, మే 16 : రైతులు పంట మార్పిడి పద్ధతిని అలవర్చుకోవాలని ఏఈవో స్రవంతి అన్నారు. మండలంలోని లెండిగూడ, తోషంతండా గ్రామంలో సోమవారం రైతులకు వానకాలం పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పంట మార్పిడితో భూసారం మెరుగుపడుతుందన్నారు. నకిలీ విత్తనాలు, ప్యాకింగ్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. లైసెన్స్ ఉన్న డీలర్ల ద్వారానే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని ధమన్గూడ, సూర్యగూడ, గర్కంపేట్ గ్రామాల్లో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఏఈవోలు బీ సాయిప్రణీత్, కే వెంకట్రావ్, శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, మే 16: రైతులు పంటలకు సేంద్రియ ఎరువులే వాడాలని ఏఈవో దేవేందర్ తెలిపారు. మండలంలోని కొప్పర్ఘాడ్ గ్రామంలో వానకాలం సన్నద్ధతలో భాగంగా సోమవారం అవగాహన కల్పించారు. వానకాలం సమీపిస్తున్నందున పంట చేన్లలో వేసవి దుక్కులు దున్నుకోవాలని పేర్కొన్నారు. రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వాడకూదన్నారు. రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ జాదవ్ ఉత్తం, రైతులు మాణిక్రావ్, తులసీరాం, బచ్చన్సింగ్, శ్యాంరావ్ పాల్గొన్నారు.