ఇచ్చోడ, జనవరి 3 : తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయులకు టీఎల్ఎం బోధన అభ్యాసన సాధనాలు ప్రదర్శన మేళా నిర్వహించారు. మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యాబోధన సామగ్రి ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను ఎంఈవో రాథోడ్ ఉదయరావుతో కలిసి డీఈవో సందర్శించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు కనీస సామర్థ్యాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ప్రదర్శన విధానంలోనే ఉపాధ్యాయులు బోధించాలన్నారు.
అప్పుడే విద్యార్థులకు త్వరగా అర్థమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధచూపుతున్నదని తెలిపారు. ఎంపీపీ ప్రీతం రెడ్డి, స ర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ శిరీశ్ రెడ్డి, ఎన్ఎంసీ చైర్మన్ గఫార్, ప్రాథమిక పాఠశాల చైర్మన్ కలీం, ఎంఈవో ఉదయ్రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జియావుద్దీన్, నవీన్కుమార్ రెడ్డి, మండల నోడల్ ఆఫీసర్ రామేశ్వరరావు, గైడ్ టీచర్స్ జగన్మోహన్ రెడ్డి, ఆశన్న పాల్గొన్నారు.
గుడిహత్నూర్ పాఠశాలలో..
గుడిహత్నూర్, జనవరి 3 : మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో ప్రణీత పాల్గొని, సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు సులభ పద్ధతిలో బోధన చేస్తే పురోగతి చెందుతారన్నారు. ప్రదర్శనల ద్వారా విద్యా బోధనతో విషయాలు గుర్తుండిపోతాయన్నారు. ఈ మేళాలో మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు బోధనకు అవసరమైన ప్రదర్శనలను ప్రదర్శించగా, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తిలకించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్, ఎంఈవో ఆర్ నారాయణ, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో సునీత, వివిధ పాఠశాలల హెచ్ఎంలు కాలే శివాజీ, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.