ఎదులాపురం, డిసెంబర్ 2 : చట్టాలపై అవగా హన కల్పించాలని, సఖీ సేవలు విస్తృత పర్చాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొ న్నా రు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి మహిళల కోసం రూపొందించిన చట్టాలను వివ రించాలని సూచించారు. డీఎల్ఎస్ఏ కార్య దర్శి క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవడం ద్వారా ఉన్నత స్థానాలకు ఎదగ వచ్చన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి మాట్లాడుతూ యువత తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా ముందుకు సాగాలని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్స్ డెస్క్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. మహిళలు 100కు డయల్ చేసి రక్షణ పొందాలని పేర్కొ న్నారు. ఫ్లెక్సీపై కలెక్టర్, అదనపు ఎస్పీ, తదిత రులు మెసేజ్లు రాశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సావిత్రి ఫూలే చిత్రపటాలకు పూలమాలలు చేశారు. దళిత స్త్రీ శక్తి జాతీయ కార్యదర్శి ఝాన్సీ, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీపీవో శ్రీనివాస్, డీఈవో ప్రణీత, సఖీ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.