ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 2 : ‘కంటి వెలుగు’ శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఇంద్రవెల్లి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. శిబిరంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించి, ఇప్పటి వరకు శిబిరానికి వచ్చిన వారి వివరాలు తెలుసుకున్నారు.
రికార్డులతోపాటు ట్యాబ్లలో లబ్ధిదారుల పూర్తి వివరాలు సక్రమంగా నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్డుల్లో ఏదీ ఖాళీగా ఉంచకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో నరేందర్రాథోడ్, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి విజయ్కుమార్, డీఎంవో శ్రీధర్, తహసీల్దార్ ముంజం సోము, ఎంపీడీవో పుష్పలత, ఆర్ఐ మెస్రం లక్ష్మణ్, సర్పంచ్ కోరెంగా గాంధారి, వైద్యులు శ్రీకాంత్, గణేశ్, సంధ్యారాణి, వైద్య సిబ్బంది శ్రీనివాస్, బలిరాం, వినోద్కుమార్, విలాస్ తదితరులు పాల్గొన్నారు.
నాగోబాను దర్శించుకున్న కలెక్టర్..
నాగోబాను కలెక్టర్ రాహుల్రాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో కలెక్టర్ను శాలువాతో సన్మానించారు. నాగోబా ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం, ఆలయ ఈవో రాజమౌళి, నాగోబా ఆలయ పూజారి మెస్రం షేకు, మెస్రం వంశీయులు నాగ్నాథ్, బాజీరావ్పటేల్ తదితరులు పాల్గొన్నారు.