ఉట్నూర్, మే 2 : గిరిజనుల ఆర్థికాభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవో క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం సమా వేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల అమలుపై అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఆశ్రమ పాఠశాలలో ఇంజినీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన మరుగుదొడ్లు, భోజనశాల, ప్రహరీ, స్నానపు గదులు, అదనపు తరగతి గదు ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ఏజెన్సీ పరిధిలో ముందస్త్తు చర్యలు చేప ట్టాలన్నారు.
మారుముల గిరిజన గ్రామాలు, తండాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రూ. 153 కోట్ల నిధులతో 122 బీటీ రోడ్లను మంజూరు చేసిందని పేర్కొన్నారు. పీవీటీజీ కుటుంబాల ఆదాయం పెంచేలా పౌల్ట్రీ ఫాం యూనిట్లు, మారుమూల గ్రామాల్లో సోలార్ విద్యుత్, బయోగ్యాస్ యూని ట్లను మంజూరు చేయాలన్నారు. సీఎం గిరి వికాసం పథకం కింద బోరు, విద్యుత్ మోటర్లు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శ్రీజ, డీడీ దిలీప్కుమార్, ఏపీవో భీంరావు, ఆర్డీవో సురేశ్, ఈఈ భీంరావు, అదనపు వైద్యాధికారి కుమ్రంబాలు, ఏపీవో పీటీజీ భాస్కర్, ఓఎస్డీ కృష్ణయ్య, ఏవో రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు.