ఆదిలాబాద్ టౌన్/ఎదులాపురం, ఏప్రిల్ 1 : పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ముందుగా సీసీ కెమెరాల ఏర్పాటు, తరగతి గదు లు, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సంఖ్య, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
జిల్లాలో 54 పరీక్షా కేంద్రాల్లో 10699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందులో రెగ్యులర్ 10608 మంది, ప్రైవేట్ 91 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. వేసవి కాలం నేపథ్యంలో ఓఆర్ఎస్ పాకెట్లను కేంద్రాల్లో ఉంచా లని వైద్య సిబ్బందికి సూచించారు. పరీక్షా కేంద్రా ల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచేలా చర్యలు తీసుకుంటు న్నామన్నా రు. అనంతరం ప్రాంగణంలో మన ఊరు – మన బడి కార్యక్రమంలో చేపడుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీఈవో టీ ప్రణీత, ప్రధానో పాధ్యాయులు బిక్కు సింగ్, పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.