ఇంద్రవెల్లి, డిసెంబర్ 7 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటు చేసి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ రాహూల్రాజ్ అన్నారు. గురువారం ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద సర్పంచ్ కోరెంగా గాంధారి అధ్యక్షతన ఆదివాసీ గిరిజనులతో పాటు అమరవీరుల కమిటీ సభ్యులతో గ్రామసభ ఏర్పాటు చేశారు. అమరవీరుల స్తూపం వద్ద చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. స్మృతి వనం ఏర్పాటుకు కావాల్సిన ఖర్చులపై నివేదికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.
అభివృద్ధి కార్యక్రమాలతోపాటు స్మృతి వనం ఏర్పాటు కోసం తీర్మానం చేశారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు పిలిపించుకొని జోడేఘాట్, అమరవీరుల స్తూపం అభివృద్ధి కోసం ప్రత్యేక నివేదికలు అడిగినట్లు తెలిపారు. అనంతరం మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కులు నాటి నీరు పోశారు. కెస్లాపూర్ మాజీ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్ మాట్లాడుతూ జనవరిలో నాగోబా జాతర ప్రారంభం కానున్నదని, ఇప్పటి నుంచే జాతర ఏర్పాట్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని కోరారు.
అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, సర్పంచ్ కోరెంగా గాంధారి, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, ఐటీడీఏ డీడీ దిలీప్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, డీఎల్పీవో భిక్షపతిగౌడ్, ఎంపీవో సంతోష్కుమార్, జీపీ ఈవో సంజీవరావ్, ఈసీ జాదవ్ శ్రీనివాస్, గిర్ధవార్ మెస్రం లక్ష్మణ్, స్పెషల్ పోలీసులు రామారావ్, దుర్వా రమణ,
రాయిసెంటర్ల సార్మేడిలు మెస్రం వెంకట్రావ్పటేల్, మెస్రం చిన్నుపటేల్, వెట్టి రాజేశ్వర్, సమక గ్రామపటేల్ పెందూర్ భగ్వంత్రావ్పటేల్, నాగోబా ఆలయ పూజారి మెస్రం షేకు, సర్పంచ్లు కినక జుగాదిరావ్, కుడే కైలాస్, తుంరం లక్ష్మణ్, నాయకులు నాగ్నాథ్, సోమోరే నాగోరావ్, ఆర్కా ఖమ్ము, ముకాడే ఉత్తం, సుంకట్రావ్, దూర్రాం, ముకాడే విష్ణు, సోయం రాందాస్, తోడసం సాగర్, యాకుబ్బేగ్, మానిక్రావ్, సోమాసే వెంకట్రావ్, పోటే సాయినాథ్ పాల్గొన్నారు.