ఆదిలాబాద్ టౌన్, జనవరి 4 : జిల్లా స్థాయి పోటీల్లో కళాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ను కలెక్టర్, అదనపు కలెక్టర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనాతో యూత్ ఫెస్టివల్ గతేడాది నిర్వహించుకోలేక పోయామన్నారు. ఈ సంవత్సరం పండుగ వాతావరణంలో కళాకారులు యూత్ ఫెస్టివల్లో పాల్గొని ప్రతిభ ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు పాల్గొనేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ యూత్ ఫెస్టివల్లో సుమారు 500 మంది కళాకారులు పాల్గొంటున్నారని తెలిపా రు. ఫోక్ డ్యాన్స్, సంప్రదాయ నృత్యాలు, పాట లు తదితర పోటీల్లో కళాకారులు పాల్గొంటున్నారన్నారు. గతంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని కళాకారులకు మంచి గుర్తిం పు వచ్చిందని చెప్పారు. ఇటీవల కాలంలో సైన్స్ ఫేయిర్, డ్యాన్స్, చిత్ర లేఖనం వంటి పోటీల్లో రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చాయని, జిల్లా సంస్కృతిని చాటి చెప్పేలా కళాకారులు ప్రతిభ చూపాలన్నారు. ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వీప్ కా ర్యక్రమాల్లో యువత పాల్గొనట్లు చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలోని కళాకారులు రాష్ట్రస్థాయి యూత్ ఫెస్టివల్లో ప్రతిభ చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని అన్నారు. జిల్లా యూత్ ఫెస్టివల్లో జ్యూరీ మెంబర్స్ను మెప్పించేలా ప్రతిభ చాటాలని కళాకారులను కోరారు. అనంతరం ప్రదర్శనలను తి లకించారు. ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, జిల్లా యువజన సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, జ్యూరీ సభ్యులు పాల్గొన్నారు.
దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపట్టాలి
ఎదులాపురం, జనవరి 4 : ధరణి, జీవో నం బర్ 58, 59 కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ధరణి, క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు తదితర అంశాలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 85 బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులు చేపట్టి 69 పూర్తి చేశామని తెలిపారు. ధరణి పోర్టల్లో 479 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, జీవో నంబర్ 59 కింద అందిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నట రాజ్, ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో రమే శ్ రాథోడ్, డీఆర్డీవో కిషన్, జడ్పీ సీఈవో గణప తి, ఏడీఆర్డీవో రవీందర్ రాథోడ్ పాల్గొన్నారు.