కాసిపేట గనిలో 116 మంది యువ కార్మికులకు ప్రమోషన్లు…
రెండేళ్ల లోపే అవకాశం కల్పించడంపై హర్షం
సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి: జీఎం శ్రీనివాస్
కాసిపేట, ఏప్రిల్ 5 : కాసిపేట ఒకటో గనిలో 116 మంది యువ కార్మికులు ఉద్యోగోన్నతులు పొందారు. బదిలీ వర్క ర్ నుంచి జనరల్ మజ్దూర్1(శాశ్వత ఉద్యోగి) ప్రమోషన్ పత్రాలను యువ కార్మికులకు మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ అందజేశారు. కాగా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జాతీయ సంఘాల కారణంగా ప్రమోషన్లు రావాలంటే ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ల సమయం పట్టేది. స్వరాష్ట్రం లో సీఎం కేసీఆర్ చొరవ, టీబీజీకేఎస్ తెచ్చిన కార్మిక సం క్షేమ నిర్ణయాలతో రెండేళ్లలోపే ప్రమోషన్లు లభిస్తున్నాయి. గతంలో ప్రమోషన్లు ఆలస్యం కావడంతో కార్మికులు ఇంక్రిమెంట్లు నష్టపోయారు. తెలంగాణ వచ్చాక కార్మిక సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నూతన నిర్ణయాలతో పెను మార్పులు తెచ్చారు. అతి తక్కువ సమయంలోనే ప్రమోషన్లు రావడం తో, యువ కార్మికుల ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. సీఎం కేసీఆర్కు, టీబీజీకేఎస్కు, సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు.
సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి: జీఎం శ్రీనివాస్
సంస్థ అభివృద్ధికి ప్రతి కార్మికుడూ కృషి చేయాలని జీఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 116 మంది కార్మికులకు ప్రమోషన్ పత్రాలు అందించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి సింగరేణి సంస్థ అనేక సదుపాయా లు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు, లాభాల వాటా ఇస్తున్న ఏకైక కంపెనీ సింగరేణి మాత్రమేనన్నారు. కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, హ క్కులు, ప్రగతి నివేదికను వివరించారు. హాజరు శాతం పెరిగితేనే ఉత్పత్తి లక్ష్యం పెరిగే అవకాశం ఉందన్నారు. అనంతరం రక్షణతో కూడిన ఉత్పత్తి తీసి లక్ష్యం చేరుతామని కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ జగన్మోహన్రావు, ఏజెంట్ కుర్మ రాజేందర్, ఐఈడీ డీవై జీఎం రాజన్న, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఓదెలు, మేనేజర్ భూ శంకరయ్య, వెల్ఫేర్ ఆఫీసర్ మీర్జా గౌస్ జీసా, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగేశ్వర్రావు, టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ దుగుట శ్రీనివాస్, ఏరియా కార్యదర్శి మేడ సమ్మ య్య, ఏఐటీయూసీ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు దాగం మల్లేశ్, పిట్ కార్యదర్శి వెంకటస్వామి, కార్మికులు పాల్గొన్నారు.
ఆనందంగా ఉంది :
2019లో సింగరేణి సంస్థలో ఉద్యోగంలో చేరాను. కాసిపేట గనిలో వి ధులు నిర్వర్తిస్తున్నా. అప్పట్లో ప్రమోషన్ పొందాలంటే చాలా ఏండ్లు పట్టేదని సీనియర్లు చెబుతున్నారు. ప్ర మోషన్లు లేక ఇంక్రిమెంట్లు జీత భత్యాల్లో నష్టం ఉండేదని అంటున్నారు. మేం ఉద్యోగంలో చేరిన తక్కువ వ్యవధిలోనే మాకు ప్రమోషన్లు ఇచ్చిండ్రు. చాలా ఆనందంగా ఉంది. కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు, సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
టీ అరుణ్, యువ కార్మికుడు, కాసిపేట గని
ఎదురు చూడకుండా ..
బదిలీ వర్కర్ నుంచి జనరల్ మజ్దూర్గా ప్రమోషన్ల కోసం ఎదురూ చూడకుండానే ఇచ్చేశారు. 2019లో సింగరేణిలో ఉద్యోగంలో చేరాను. యాజమాన్యం కార్మికులకు అనేక సౌకర్యా లు కల్పిస్తున్నది. గతంలో సంస్థలో పని అంటే ఎంతో భ యం ఉండేది. తెలంగాణ వచ్చాకే కార్మిక సంక్షేమ విధానా లు అమలవుతున్నాయి. ప్రస్తుతం వచ్చిన ప్రమోషన్తో జీత భత్యాలు పెరడంతో పాటు శాశ్వత ఉద్యోగిగా గుర్తిస్తారు. సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు.
-ఏ శ్రీమాన్ (యువ కార్మికుడు – కాసిపేట గని)