రెబ్బెన, జనవరి 4: ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ వేణు అన్నారు. మండలంలోని గోలేటి, రెబ్బెన, రాజారం, కొమురవెళ్లి గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహించడంతో పాటు అన్ని గ్రామపంచాయతీల్లో గురువారం ఆరు గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి ప్రభాకర్, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ సమీర్, డిప్యూటీ తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీవో అంజాద్పాషా, ఏవో మంజుల, ఏఈ ఇమ్రాన్, ఎపీఎం రాజ్కుమార్, ఎపీవో బుచ్చన్న, సబ్ ఇంజినీర్ శిరీష, సర్పంచ్లు పొ టు సుమలత, బొమ్మినేని అహల్యాదేవి, కోఆప్షన్మెంబర్ జౌరోద్దీన్ పలువురు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేవిధంగా చర్యలు చేపడుతుందని జిల్లా డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు స్పష్టం చేశారు. మండలం లోని గోలేటిలో ఆరు గ్యారెంటీ పథకాల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల స మయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ తప్పకుండా అమ లు చేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు సంగెం ప్రకాశ్రావు, భిక్కునాయక్, లావుడ్య రమేశ్, మోడెం సుదర్శన్గౌడ్, దుర్గం రవీందర్, కేసరి కిషన్గౌడ్, దుర్గం దేవాజీ, సురేందర్రాజు, దుర్గం తిరుపతి,వామన్, కసూ ్తరి రవి, బాలునాయక్ పలువురు ఉన్నారు.
కెరమెరి, జనవరి 4 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో మహేందర్ అన్నారు. గురు వారం మండలంలోని పార్డ, మెట్టపీప్రీ గ్రామాల్లో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇం టి యజమాని ఫొటోతో పాటు రేషన్,ఆధార్కార్డుల జిరాక్స్తోపాటు కావాల్సిన సంక్షేమ పథకాలను ఎంపిక చేస్తూ దరఖాస్తు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు భీంరావ్, కుడ్మెత విజయ, ఏవో గోపికాంత్, ఏపీవో మల్లయ్య, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
వాంకిడి,జనవరి 4: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పథకాలకు రేషన్కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తహసీల్దార్ రహీమొద్ధీన్ సూచించారు. గురువారం మండలంలోని సరాండి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజాపాలన కార్యక్రమం లో భాగంగా సరాండి సర్పంచ్ దుర్గం కమలాకర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భం గా స్థానిక సర్పంచ్ కమలాకర్ మాట్లాడుతూ, ప్రతి కుటుం బం ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే రేషన్కార్డు దరఖాస్తు చేసుకునేవారు తెల్లకాగితంపై దరఖాస్తులను అందజేయాలని ప్రజలకు సూచించారు. కా ర్యక్రమంలో వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
బెజ్జూర్, జనవరి 4 : మండలంలోని 22 గ్రామపంచాయతీల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. మండలకేంద్రంలో స్థానిక సర్పంచ్ అన్సార్ హుస్సే న్, స్థానిక ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఆయా గ్రామాల్లో కార్యదర్శు లు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
పెంచికల్పేట్, జనవరి 4 : మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నట్లు కొండపల్లి సెక్ర టరీ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా దరఖాస్తులను స్వీకరి స్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రా మాల సర్పంచ్లు,పంచాయతీ కార్యదర్శులు, అంగన్ వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.
సిర్పూర్(టీ), జనవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 గ్యారంటీల ప్రజాపాలన కార్యక్రమంలో గురువారం మండలకేంద్రానికి చెందిన అనాథ పిల్లలు ధరఖాస్తు చేసుకున్నారు. సిర్పూర్(టీ) మండలకేంద్రానికి చెందిన మహమ్మద్ యూసఫ్, ఆసియాబేగం దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. తల్లి ఆసియా బేగం గత ఏడేళ్ల క్రితం పాముకాటుతో మృతి చెందింది. తండ్రి మహమ్మద్ యుసఫ్ 2 ఏండ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం తో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.
పెద్ద కూ తురు మహిన్ నిదా ఇంటర్మీడియేట్ మొదటి సంవత్స రం చదువుతోంది. రెండో కూతురు నూరి బేగం ప్రభు త్వ పాఠశాలలలో 9వ తరగతి చదువుతున్నది. కుమారుడు మహమ్మద్ ముస్తాఫా మదర్సాలో చదువుతున్నాడు. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కా ర్యక్రమంలో ఆ పిల్లలు దరఖాస్తు చేసుకున్నారు. తమకు ఉండేందుకు ఇళ్లు కేటాయించాలని తహసీల్దార్ శ్రీనివాస్కు దరఖాస్తు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.