గుడిహత్నూర్,జనవరి19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు పథకం ద్వారా అంధత్వ నివారణకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గుడిహత్నూర్ పంచాయతీలో రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. కొల్హారిలో కంటివెలుగు శిబిరాన్ని జడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్, స్థానిక సర్పంచ్ గిత్తె కల్పన ప్రారంభించారు. ఎంపీడీవో సునీ త, తహసీల్దార్ సంధ్యారాణి, సర్పంచ్ జాదవ్ సునీత, ఎంపీవో లింగయ్య, మండల వైద్యాధికారి శ్యాంసుందర్, ఐకేపీ ఏపీఎం భగవాండ్లు, వైద్యులు రోజారమణి, రవళి, కార్యదర్శి రాందాస్, ఉపసర్పంచ్ గజానంద్, బీఆర్ఎస్ నాయకులు బూర్ల లక్ష్మీనారాయణ, జాదవ్ రమేశ్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, జనవరి 19 : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మండలంలోని నర్సాపూర్, ఇస్లాం నగర్, కొకస్మన్నూర్లో కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీపీ ప్రీతంరెడ్డి, డాక్టర్లు సాగర్, నరేశ్, హిమబిందు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, జనవరి19 : మండలకేంద్రంలోని రైతువేదికలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, వైద్యాధికారులు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ పరాచ లావణ్య, వైద్యాధికారులు భీంరావ్, శిల్ప, ఆలేఖ్య, వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్, ఎంపీడీవో రాథ,ఎంపీవో మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
భీంపూర్, జనవరి19: మండలంలోని కరంజి(టీ) ఆరోగ్య ఉపకేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సర్పంచ్ గుర్ల స్వాతిక, ప్రత్యేకాధికారి గోపీకిషన్ ప్రారంభించారు. అనుబంధ గ్రామం రాజులవాడికి చెందిన 300 మందికి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశారు. ఉపసర్పంచ్ ఆకటి లక్ష్మీబాయి ,బీఆర్ఎస్ నాయకులు జీ నరేందర్యాదవ్, నరేందర్రెడ్డి, వైద్యాధికారి నిఖిల్రాజ్, హెచ్ఈవో లింగంపల్లి జ్ఞానేశ్వర్, సిబ్బంది గంగాధర్, లూసీ, పూర్ణిమ, సుజాత, ప్రవీణ, దివ్య,శ్రీదేవి, భాగ్యవతి, గోదావరి, రేఖ,రోజా, విష్ణుకుమార్, అశోక్రెడ్డి ,శివాజీ , శంకర్ ఉన్నారు.
బోథ్, జనవరి 19: మండలంలోని పొచ్చెరలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ తుల శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశ్, ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీవో జీవన్రెడ్డి, డాక్టర్ కే నవీన్రెడ్డి, సొసైటీ చైర్మన్ కే ప్రశాంత్, ఎంపీటీసీ కే రాజమణి, మహిపాల్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
భీంపూర్, జనవరి19: తాంసిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ సురుకుంటి మంజుల, ఎంపీడీవో ఆకుల భూమయ్య, వైద్యాధికారి శ్రావ్య, సర్పంచ్ స్వప్న రత్నప్రకాశ్, సదానందం, బీఆర్ఎస్ కన్వీనర్ అరుణ్, నాయకులు గంగారాం, బొంత కాంతారెడ్డి, జింక మహేందర్,కంది గోవర్ధన్రెడ్డి, శ్రీధర్రెడ్డి ,రఘు ఉన్నారు.
నేరడిగొండ, జనవరి 19 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని జడ్పీటీసీ జాదవ్ అనిల్ ప్రారంభించారు. ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, సర్పంచ్ పెంట వెంకటరమణ, ఉప సర్పంచ్ దేవేందర్రెడ్డి, ఎంపీడీవో అబ్దుల్ సమద్, వైద్యులు సద్దాం, వెంకటేశ్, హెచ్ఈవో హరికుమార్గౌడ్, సూపర్వైజర్ రాంనరేశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బేల,జనవరి19 : మండలంలోని సిర్సన్నలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, నాయకులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ వనితా ఠాక్రే, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు తన్వీర్ఖాన్, దీపక్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శంకర్, ఎంపీడీవో భగత్ రవీందర్, డాక్టర్ వంశీ కృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఉట్నూర్/ఉట్నూర్ రూరల్, జనవరి19 : మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ పంద్ర జైవంత్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చారులత, ఏజెన్సీ వైద్యాధికారి బాలు, వైద్యులు అనురాధ, సంతోష్, సిబ్బంది రాంబాబు, ఈవో శంకర్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు. ఉట్నూర్ మండలం శ్యాంపూర్ పీహెచ్సీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, ఎంపీడీవో తిరుమల, సర్పంచ్ గుండాల మల్లిక ప్రారంభించారు. ఎంపీపీ పంద్ర జైవంత్రావు, జడ్పీటీసీ చారులత శిబిరాన్ని సందర్శించారు. కంటి వెలుగు కర పత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేశవ్, వైద్యాధికారి సందీప్, నాయకులు కేంద్రే రమేశ్, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జనవరి19 : ఇంద్రవెల్లి పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, మండల ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, ఎంపీడీవో పుష్పలత, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, పీఏసీఎస్ చైర్మన్ మారుతీ పటేల్డోంగ్రే, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అంజద్, ఈవో సంజీవరావ్, వైద్యులు శ్రీకాంత్, గణేశ్, కంటి వెలుగు సూపర్ వైజర్ శ్రీనివాస్, పీహెచ్ఎన్ జ్యోతి, వైద్య సిబ్బంది రాకేష్, బలిరాం, లక్ష్మి, నాయకులు సూఫియాన్, సుంకట్రావ్, సాయినాథ్ పాల్గొన్నారు.
నార్నూర్,జనవరి19: నార్నూర్ పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ కనక మోతుబాయి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కావల రమేశ్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశే ఖర్, సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్, ఎంపీవో స్వప్నశీల, నార్నూర్ సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, ఉప సర్పంచ్ మహేందర్, డైరెక్టర్ దుర్గే కాంతారావ్, చౌహాన్ యశ్వంత్రావ్, హెచ్ఈవో చౌహాన్ నాందేవ్, వైద్య సిబ్బంది ఉన్నారు.
నార్నూర్,జనవరి19: గాదిగూడ మండలం ఖడోడి పంచాయతీ కార్యాలయంలో కంటివెలుగు కార్యక్రమాన్ని గాదిగూడ ఎంపీపీ ఆడా చంద్రకళ, రాజేశ్వర్ ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మర్సివనే యోగేశ్, సర్పంచ్ మెస్రం మడావి సేతాబాయి,వైద్యులు సంజీవ్, స్నేహ, హెచ్ఈవో పవార్ రవీందర్, డీఈవో శశికాంత్, ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు.
ఆదిలాబాద్ టౌన్, జనవరి 19 : పట్టణంలోని సుభాష్నగర్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్వో సాధన, మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, కౌన్సిలర్ లక్ష్మణ్, నాయకులు దమ్మపాల్ పాల్గొన్నారు.
ఎదులాపురం,జనవరి19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రచారం కోసం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ అలాల అజయ్ సొంత డబ్బులతో రెండు ఆటోలను ఏర్పాటు చేశారు. స్థానిక కంటి వెలుగు శిబిరం వద్ద ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అతడిని ఎమ్మెల్యే, కలెక్టర్ అభినందించారు.