నస్పూర్, జనవరి 24 : బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నస్పూర్లోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్త్రీ, శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, డీఆర్డీవో శేషాద్రి, డీఈవో యాదయ్యతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ‘బాలికలను రక్షిద్దాం..బాలికలను చదివిద్దాం’ అనే కార్యక్రమంలో భాగంగా బాలికల సంరక్షణ, భ్రూణహత్యలు, బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. చదువులో బాలుర కంటే బాలికలు చక్కగా రాణిస్తున్నారని అభినందించారు. ‘వాల్యూ ఆఫ్ గర్ల్చైల్డ్’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విద్యార్థినులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ సమితి చైర్మన్ వాహిద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, జనవరి 24: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినులు ‘బేటీ బచావో.. బేటీ పడావో, సేవ్ గర్ల్స్, సేవ్ చిల్డ్రన్స్’ తదితర నినాదాలతో ముగ్గులు వేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి నస్పూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమత హాజరై మాట్లాడారు. ఆడ పిల్లలు ఉన్నత చదువులు అభ్యసిస్తే చక్కటి భవిష్యత్ ఉంటుందన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
చెన్నూర్, జనవరి 24: బాలికల ఆర్థిక భద్రతకు సుకన్య సంవృద్ధి యోజన పథకం ఎంతో ఉపయోగపడుతందని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (పాతబస్ స్టాండ్ బ్రాంచ్) మేనేజర్ కల్యాణపు రమేశ్ అన్నారు. చెన్నూర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో బుధవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు తల్లిదండ్రులు సుకన్యా సంవృద్ధి యోజన పొదుపు ఖాతాలను తీసుకున్నారు. వారిని అభినందించి, ప్రోత్సాహక బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు క్యాషియర్ రవీందర్, సిబ్బంది సందీప్ తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి, జనవరి 24 : కోటపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాలిక విద్యా, ప్రాముఖ్యత, కస్తూర్బా విద్యాలయాలతో ప్రయోజనాలను పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హరిత వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బావనపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులకు తల్లిదండ్రులతో ఆశీర్వాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బొలిశెట్టి బుచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.
నెన్నెల, జనవరి 24: జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెన్నెల కస్తూర్బా పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించారు. నెన్నెల హెడ్ కానిస్టేబుల్ అజయ్, ఎస్వో పెట్టం కవిత చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించారు.
వేమనపల్లి, జనవరి 24 : వేమనపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం బాలిక దినోత్సవాన్ని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధుకర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సువర్ణ, ఏఎన్ఎం రాజేశ్వరి, టీచర్ సంధ్యారాణి, హెల్త్ సీహెచ్వో రాజిరెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.