నస్పూర్, మార్చి 11 : ప్రభుత్వ నిబంధనల మేరకే వరిధాన్యం కొనుగోళ్లు చేపడుతారని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వాజిద్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా రవాణా అధికారి సంతోష్కుమార్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపాల్తో కలిసి సమావేశం నిర్వహించారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేపడుతుందని, రైతులు నిబంధనలు పాటించాల్సి ఉంటుందని సూచించారు. కొనుగోళ్లకు అవసరమైన గన్నీ సంచులను సమకూర్చుకోవాలన్నారు. ఏ గ్రేడ్క్రానికి క్వింటాలుకు రూ. 2,203, సాధారణ రకానికి రూ.2183 మద్దతు ధర నిర్ణయించడం జరిగిందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.