కెరమెరి, జనవరి 27 : ఆదిమ గిరిజన తెగల ఆధార్ అప్డేట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ సెంటర్ను శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ అప్డేట్ కోసం కెరమెరికి వచ్చే మారుమూల ప్రాంతాల ఆదివాసులకు ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. తాగునీరు, అల్పాహారంవంటి సదుపాయం కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేందర్, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్ పాల్గొన్నారు.