తలమడుగు, జూన్ 9 : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని అ న్నారు.
ప్రతి గ్రామంలో విసృ్తతంగా సభ్యత్వాలు నమోదు చేసి గత రికార్డులను అధిగమించేలా లక్ష్యంతో పని చేయాలని సూచించారు. అలాగే ఎస్ఐఆర్పై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య రక్షణతోపాటు ప్రజల హకులను కాపాడే దిశగా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని, కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చే యాలన్నారు. మండల కన్వీనర్ తోట వెంకటేశ్, కేదారేశ్వర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మొట్టె కిరణ్, అబ్దుల్లా, సుదర్శన్రెడ్డి, ప్రకాశ్రెడ్డి, చంటి, నర్సిములు, ఆశన్న యాదవ్, ప్రకా శ్, వెంకన్న, రాజేశ్వర్ పాల్గొన్నారు.