బెల్లంపల్లి, జనవరి 7 : యువత రాజకీయాలకతీతంగా బెల్లంపల్లి అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఏసీపీ సదయ్య కోరారు. ఆదివారం పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్లో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ముందుగా టాస్ వేసి బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ టీమ్, మున్సిపల్ కార్యాలయ టీమ్ల మధ్య పోటీని ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలపై మక్కువ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఎస్పీ పులాల రవికుమార్, ఎస్హెచ్వోలు రమేష్, బన్సీలాల్, ఎస్ఐలు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిప్ప మనోహర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య, కాంగ్రె స్ నాయకులు మల్లారపు చిన్నరాజం, ఈసా, ఆదర్శవర్ధన్ రాజు, సిరంగి శంకర్, కొమ్ము రాజన్న, బండి లక్ష్మణ్, జాడి మహేశ్, దుర్గం గోపాల్, మల్లాగౌడ్, తారా చంద్, నర్సయ్య, బామండ్లపల్లి స్వామి, బాలు యాదవ్, శ్రీనివాస్, మూర్తి, ఎనగందుల వెంకటేశ్, భామండ్లపల్లి భరత్, మైదం అనిల్, నవీన్, అభిలాష్, వెంకటస్వామి, విజయ్ పాల్గొన్నారు.