ఎదులాపురం,జనవరి25 : జిల్లాలో ‘కంటివెలు గు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత ప్రచారంతో పాటు ఇంటింటికీ వెళ్లి వివరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంటివెలుగు శిబిరాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 33 శిబిరాలను ఏర్పాటు చేసి రోజుకు సుమారు 5,700 మందికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని, ఇందులో 16 నుంచి 17 శాతం మందికి రీడింగ్ అద్దాలు తక్షణమే అందిస్తున్నామని , పది శాతం మందికి ప్రిస్కిప్షన్ కలిగిన అద్దాలకు ఆన్లైన్ ద్వారా ఇండెంట్ పంపిస్తున్నామని చెప్పారు. కలెక్టరేట్ , ఎస్పీ కోర్టు కాంప్లెక్స్, మీడియా వారికి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 18 ఏళ్లు నిం డిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్ష చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి అరవింద్ కుమార్, డీపీఆర్వో ఎన్. భీంకుమార్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
సోన్, జనవరి 25 : కంటిపరీక్షలకు వచ్చేవారికి ఎ లాంటి ఇబ్బందుల్లేకుండా చూసి వివరాలు పక్కా గా నమోదు చేయాలని కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. నిర్మల్, సోన్ మండలంలోని ఎల్లపెల్లి, న్యూవెల్మల్ గ్రామా ల్లో శిబిరాలను బుధవారం తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్, కంటి పరీక్షల విధానం, కండ్లద్దాల పంపిణీ, ఆన్లైన్ నమోదు, తదితర వివరాలను పరిశీలించారు. ప్రత్యేకాధికారి నర్సింహారెడ్డి, వైద్యులు శ్రీనివాస్, సర్పంచ్లు రవీందర్రెడ్డి, అంకం గంగామ ణి, తహసీల్దార్ హిమబిందు, వై ద్యులు సమత, నిఖిలారాణి, వైద్య సిబ్బంది పా ల్గొన్నారు.
డీఆర్డీవో ఉద్యోగులకు కంటి పరీక్షలు
నిర్మల్ టౌన్, జనవరి 25: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని శిబిరంలో డీఆర్డీవో ఉద్యోగులు బుధవారం కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య బృందం పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, అద్దాలను అందించారు.