కాగజ్నగర్ ఎస్పీయం కాలనీ, డిసెంబర్ 22 : కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్ విలేజ్ నంబర్-10కి చెందిన వికాస్, సులేఖ దంపతుల కుమార్తె ప్రీతి బసు 15 నెలల ఆర్మీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని రాగా, రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం కాగజ్నగర్ రైల్వే స్టేషన్కు చేరుకొని పుష్ఫగుచ్చాలు అందించి అభినందించారు. అనంతరం ఊరేగింపు తీశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఆర్మీకి సెలక్ట్ అయిన మొట్టమొదటి యువతిగా ప్రీతి బసు నిలిచింది.
నాగాలాండ్ రాష్ట్రం అస్సాం రైఫిల్స్లో ట్రైనింగ్ తీసుకొని రావడం జిల్లాకే గర్వకారణమని రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే శివ, ఉపాధ్యక్షుడు పాపయ్య, జనరల్ సెక్రెటరీ సునీల్ మండల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వినాయక చాప్డె, జాయింట్ సెక్రెటరీ రమాకాంత్ యాదవ్, ట్రెజరర్ శివప్రసాద్, దిలీప్ సర్కార్, రాజేశ్గోష్, తార పద మండల్, శివ పద మండల్, అజయ్ మిశ్రా, డీ.శ్రీనివాస్, అనురోధ్సింగ్ తదితరులు పాల్గొన్నారు.