రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఆది నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. దశల వారీ కార్యక్రమాలను వినూత్నంగా అమలు చేస్తూ కార్పొరేట్కు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నది మొన్నటి వరకు ‘మనఊరు మనబడి’ ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించిన ప్రభుత్వం ఆ తర్వాత బడిబాట ద్వారా పిల్లలను స్కూళ్లకు వచ్చేలా చేసింది. ఇక తరగతి గదుల్లో విద్యావిధానం పటిష్టతకు సిద్ధమవుతున్నది
నిర్మల్ అర్బన్, జూన్ 25: నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పఠనోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించనుంది. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించను న్న ఈ వినూత్న కార్యక్రమంతో విద్యార్థులు చదువుల్లో మరింత రాటు దేలనున్నారు. పఠనోత్సవానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించింది. అంతే కాకుండా విద్యార్థుల సామర్థ్యానికి సంబంధించిన పఠన పుస్తకాలను అందుబాటులో ఉంచింది. వీటితో పాటు 101 పాఠశాలలకు 10592 లైబ్రరీ పుస్తకాలను పంపిణీ చేశారు.
735 పాఠశాలల్లో అమలు..
విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడం, స్వతంత్రంగా చదివే పాఠకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ పఠనోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ 26 నుంచి జూలై 31 వరకు ఈ కారక్రమాన్ని నిర్వహించనుంది. నిర్మల్ జిల్లాలోని 733 ప్రభుత్వ పాఠశాలల్లో 49,943 మంది విద్యార్థులు చదువుతున్నారు. మైనార్టీ గురుకులంలో 632, 18 కేజీబీల్లో 4981, 4 సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 2962, 63 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 4425, 2 టీడబ్ల్యూ సొసైటీల్లో 715, 7 బీసీ వెల్ఫేర్లో 2829 మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుతున్నారు. జిల్లాలో దాదాపు 70 వేల మంది విద్యార్థు లు పఠనోత్సవం ద్వారా మరింత రాటు దేలనున్నారు.
పఠనోత్సవం అమలు ఇలా..
చదవడం చేయగలిగినవారే దేనినైనా నేర్చుకోగలుగుతారు. చదవడం తో విద్యార్థులకు సృజనాత్మక ఆలోచనలు, వ్యక్తీకరణ సామర్థ్యానికి బాటలు పడనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ పఠనోత్సవాన్ని నిర్వహిస్తా రు. ప్రతి తరగతికి ఒక్కో పీరియడ్ పఠనానికి కేటాయిస్తారు. ఐదు గు రు విద్యార్థులతో గ్రంథాలయ కమిటీని ఉపాధ్యాయులు నియమిస్తా రు. ప్రతి పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు గ్రంథాలయ కమిటీని నియమిస్తారు. ఇందులో విద్యార్థుల సామర్థ్యానికి తగిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రతి శనివారం పఠన పోటీలను నిర్వహించనున్నారు. ప్రతి మాసంలో మూడో శనివారం పాఠశాలలో నిర్వహించే తల్లిదండ్రుల సమావేశంలో వారి ముందు చదివి వినిపించి విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని వివరిస్తారు.
పటిష్టంగా పర్యవేక్షణ..
నిర్మల్ జిల్లాలో వచ్చే నెల 31 వరకు నిర్వహించనున్న పఠనోత్సవ కా ర్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణ కమిటీని నియమించింది. జిల్లా స్థాయిలో డీఈవో, మండల స్థా యిలో సెక్టోరియల్ అధికారులకు మండలాల వారీగా బాధ్యతలను అప్పగించారు. వీరు ప్రతి మండలంలోని పాఠశాలలను తనిఖీ చేస్తూ పర్యవేక్షిస్తారు. పాఠశాలల్లో పఠనోత్సవం తీరును విద్యార్థుల నుంచి స్వయంగా తెలుసుకొని నివేదికలను డీఈవోకు అందించనున్నారు. ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పకడ్బందీగా అమలు చేస్తాం
విద్యార్థుల్లో చదవడం ఆలవాటుగా మార్చడం, స్వతంత్రులుగా చదివేందుకు ఈ పఠనోత్సవాన్ని నిర్వహిస్తు న్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నది. జిల్లాలో పఠనోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చే స్తాం. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలకు పఠనోత్సవాన్ని అమలు పర్చాలని ఆదేశాలు జారీ చేశాం. సెక్టోరియల్ అధికారులతో నిత్యం పర్యవేక్షిస్తాం.
-డాక్టర్ రవీందర్ రెడ్డి, డీఈవో నిర్మల్