దండేపల్లి, మార్చి 10 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ గ్రామానికి చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుండగా, ఈ నెల 3న ‘నమస్తే తెలంగాణ’లో ‘అభిజిత్ను బతికించరూ..’ పేరిట కథనం ప్రచురించగా, దాతలు స్పందిస్తున్నారు. ఆదివారం మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభిజిత్ కుటుంబ సభ్యులకు రూ.20 వేల సాయమందించి భరోసానిచ్చారు.
దాతల నుంచి ఇప్పటి వరకు రూ.2.50 లక్షలు అందినట్లు అభిజిత్ తల్లిదండ్రులు ఈర్ల సతీశ్-మౌనిక తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగ సంక్షేమ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బొలిశెట్టి రాజన్న, పోలంపెల్లి శ్రీనివాస్, అప్పాల మనోహర్, కుంచె కిషన్, జాబు సుగుణాకర్, బొలిశెట్టి బుచ్చన్న, కళ్లెం రాజు, నల్లెల సంతోష్, రామరాజు, కొండు రామన్న, ముత్తినేని రమేశ్ ఉన్నారు.