ఆదిలాబాద్ జిల్లాలోని ప్రకృతి రమణీయతను గురువారం తెల్లవారుజామున పొగమంచు కమ్మేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉదయం 10 గంటలైనా వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించారు. ఇంద్రవెల్లి మండలంలోని ఆదివాసీ గ్రామాలను పొగమంచు దట్టంగా కమ్మేసింది. అడవిలోని చెట్లు, గుట్టలన్నీ తెరమరుగైనట్లు కనిపించాయి.
మండలంలోని ఏమాయికుంట గురుదేవ్ చెరువులోని నీరు సైతం పొగమంచులో కలిసిపోయింది. నార్నూర్ మండలంలో భానోదయం వేళ.. ప్రకృతి అందాలను మంచు దుప్పటి కప్పేయగా.. ఆ దృశ్యాలు కనువిందు చేశాయి.
– ఎదులాపురం/ ఇంద్రవెల్లి/నార్నూర్, జనవరి 5