ఇంద్రవెల్లి, డిసెంబర్ 3 : కార్పోరేట్ జూవెల్లరీ దుకాణాల కారణంగా ఉపాధి కోల్పోతున్న చేతివృత్తి స్వర్ణకారులను ప్రభుత్వం చేయూతను అందించాలని స్వర్ణకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బోకన్ రాజేశ్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ ముంజం సోముకు వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడ స్వర్ణకారుల సంఘం మండలాధ్యక్షుడు జాదవ్ కేశవ్, ఉపాధ్యక్షులు అరుణ్, సభ్యులు సంజీవ్కుమార్, మహేశ్, రాజేశ్, నితిన్ సునీల్, మాధవ్, ప్రమోద్, విజయ్, హరీశ్, ఆశోక్ ఉన్నారు.
ఉట్నూర్రూరల్, డిసెంబర్ 3: మండలంలోని స్వర్ణకారులు సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ కోరారు. శనివారం తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. సభ్యులు వెంక టచారి, శేఖర్చారి, సత్యం తదితరులు ఉన్నారు.