ఇంద్రవెల్లి, ఏప్రిల్ 9 : హర్కాపూర్ అంధ్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కైలాస్నగర్ గ్రామానికి చెందిన చిన్నారి శృతిలయ(6) వాంతులు చేసుకుని మృతిచెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. డాకురే రాము-మంజుల దంపతులకు శృతిలయ, పృథ్వీరాజ్లు ఉన్నారు. నెల రోజుల క్రితం శృతిలయ అనారోగ్యానికి గురికాగా రిమ్స్లో వైద్య పరీక్షలు చేయించారు. చిన్నారి గుండెలో నరం బ్లాక్ అయిందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.
వైద్యుల సూచనల మేరకు నెల రోజుల క్రితం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని స్టార్ దవాఖానలో ఆపరేషన్ చేయించారు. అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. నెల రోజులుగా ఆరోగ్యంగా ఉన్న శృతిలయ మంగళవారం వేకువ జామున వాంతులు చేసుకోవడంతో రిమ్స్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి మృతి చెందిన్నట్లు వైద్యులు తెలిపారు. ఏకైక కూతురు మృతి చెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కైలాస్నగర్లో పండుగ పూట విషదచాయలు అలుముకున్నాయి.