ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, జూన్ 30 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి గిరిజన గ్రామం ఎత్తయిన గుట్టల నడుమ, పచ్చదనపు శోభతో గోచరిస్తున్నది.
ఈ అడవి మార్గం గుండా వెళ్లే రైళ్లలో ప్రయాణం ఒక అద్భుత మధురానుభూతి. కాగా, అవతల నుంచి ఈ దృశ్యం వానకాలం అయితే ఎప్పటికీ నిత్యనూతనమే. గురువారం ప్రకృతి గీసిన ఈ కాన్వాస్ ను ‘నమస్తే తెలంగాణ’ తన కెమెరాలో బంధించింది.