దస్తురాబాద్,డిసెంబర్ 2 : మండల పరిధిలో గురువారం జరిగిన పోలింగ్లో అతివలే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 12 వేల 705 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషు లు 6,199 మంది, స్త్రీలు 6, 505 మంది ఉన్నా రు. వీరిలో 10,333 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మండలంలో 81.33 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పురుషులు 6199 మంది ఉండగా వీరిలో 4,681 మంది తమ ఓటును వేశారు. అలాగే మొత్తం స్త్రీలు 5,652 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల కంటే 971 ఎక్కువ మంది మహిళ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో వారి ఓటింగ్ 86.88 శాతం నమోదైంది.