ఉట్నూర్, నవంబర్ 30 : ఖానాపూర్ నియో జకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతం గా జరిగాయి. 77.46 శాతం పోలింగ్ నమో దైంది. ఈవీఎంల్లోని సాంకేతిక సమస్యల దృష్ట్యా పలు కేంద్రాల్లో పోలింగ్ ఆల స్యంగా ప్రారంభమైంది. నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాల్లో ప్రజ లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకు న్నారు. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకు నేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి వసతులను ఏర్పాటు చేశారు.
అక్కడక్కడ మొరాయించిన ఈవీఎంలను అధికారులు సరి చేశారు. వంకతుమ్మ, నర్సా పూర్-బీ గ్రామాలతో పాటు మరిన్ని గ్రామాల గిరిజనులు ఓట్ల కోసం వాగులు దాటుతూ కాలి నడకన, ట్రాక్టర్ల ద్వారా సమీప పోలింగ్ కేంద్రాల కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. బాలింతలు చంటి పిల్లలతో, వృద్ధులు యువకుల సాయంతో కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ఆధ్వర్యంలో బందో బస్త్తు నిర్వహించారు.
ఉట్నూర్ రూరల్, నవంబర్ 30 : మండ లం లో బిర్సాయిపేట్, దంతన్పెల్లి, గోండ్గూడ, లింగోజితండా, శ్యాంపూర్, పులిమడుగు, సాలే వాడ, హస్నాపూర్, చాందూరి, నర్సాపూర్ తది తర గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ నాగేందర్ పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఎలక్షన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఖానాపూర్, నవంబర్ 30 : ఖానాపూర్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. వయో వృద్ధ్దులతో పాటు యువకులు ఉత్సహంగా పోలిం గ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఖానాపూర్తో పాటు మండలంలో మొత్తం 50 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఓటర్లు 36,413 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 18820, పురుషులు 17,593 మంది ఉన్నారు. ఖానాపూర్లో ఉదయం 7 గంటల నుంచే ఓటిం గ్ ప్రారంభమైంది. దివ్యాంగుల సౌకర్యం కోసం వీల్చైర్లు పోలింగ్స్టేషన్ల వద్ద ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.
ఖానాపూర్ రూరల్, నవంబర్ 30 : ఖానా పూర్ మండలంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాం తంగా ముగిసాయి. ఓటు హక్కును వినియోగిం చుకునేందుకు ప్రజలు ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిచంగా, మరికొన్ని చోట్లలో సజావుగా పోలింగ్ కొనసాగింది. ఆయా గ్రామా ల్లో ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియో గించుకున్నారు.
కడెం, నవంబర్ 30 : మండలంలో మొత్తం 28276 ఓట్లకు గానూ 22537 ఓట్లు నమోదై నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఓటింగ్ 79.70 శాతం నమోదైనట్లు వారు పేర్కొన్నారు. మండలంలో మొత్తం 28 గ్రామ పంచాయతీలకు గానూ 36 పోలింగ్ బూత్లున్నాయి. అల్లంపల్లి 79.88, గంగాపూర్ 85.47, కొర్రతండా 78.10, రాణిగూడ 77.33, గండిగోపాల్పూర్ 91.04, ఉడుంపూర్ 85.21, మాసాయిపేట 88.44, ఇస్లాంపూర్ 84.60, కల్లెడ 83.33, నవాబుపేట 83.00, అంబారిపేట 81.39, పాండ్వాపూర్ 87.21, పెద్దబెల్లాల్ 67.36, చిన్నబెల్లాల్ 74.46, మొర్రిగూడ 79.26, కొండుకూర్ 82.28, కన్నాపూర్ 79.77, కడెంపెద్దూర్ 77.42, పెద్దూర్ 74.44, 7001, ధర్మాజిపేట 80.52, న్యూధర్మాజిపేట 77.28, నర్సాపూర్ 79.33, చిట్యాల్ 83.11, లక్ష్మీసాగర్ 82.73, మద్దిపడగ 74.82, కొత్తమద్దిపడగ 79.66, ఎలగడప 73.81, దిల్దార్నగర్ 83.11, లింగాపూర్ 74.43, 78.82, సారంగపూర్ 77.91, మాసాయిపేట 84.01, నచ్చన్ ఎల్లా పూర్ 82.14 శాతం నమోదైంది.
దస్తురాబాద్, నవంబర్ 30 : మండలంలో 12705 ఓటర్లు ఉండగా ఇందులో 10333 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగిం చుకు న్నారు. మండలంలోని 81.03 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రతి పోలిం గ్ కేంద్రాన్ని తహసీల్దార్ ఎండీ జాకీర్, ఎంపీడీవో లు విజయ్ భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, ఎన్నికల అధికారులు, సంద ర్శిం చారు. పెర్కపల్లె పోలింగ్ కేంద్రంలో 145 ఈవీ ఎం మొరాయించడంతో కొత్త ఈవీఎంను ఏర్పా టు చేశారు. మున్యాలలోని 150 పోలింగ్ బూత్ లో ఉదయం ఈవీఎం కొద్ది సేపు మొరా యించ గా, కొత్త ఈవీఎంను ఏర్పాటు చేశారు. ఖానా పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
పెంబి, నవంబర్ 30 : మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. వృద్ధ్దులు, దివ్యాంగుల ను వీల్ చైర్లపై పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓటు వేయించారు. పెంబిలోని 200 బూత్లో ఆర గం ట ఈవీఎం మొరాయించింది. గుమ్మెన, ఎంగ్లా పూర్ గ్రామంలో ఓటర్లు మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఓటింగ్లో పాల్గొనలేదు. జిల్లా అదనపు కలెక్టర్ గ్రామానికి వెళ్లి ప్రజలతో ఓట్లు వేయించారు. మండలంలో 10528 ఓటర్లు ఉండగా 8790 మంది ఓటు వేశారు. 83.49 శాతం పోలింగ్ నమోదైంది. మహిళలు 5148 మంది, పురుషులు 5380 మంది ఉన్నారు.
ఇంద్రవెల్లి, నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి. మండలంలోని 42 కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఉదయం 7 గంటలకే పోలింగ్ను ప్రారంభించారు. ప్రజలు ఉదయం 7గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరు కొని తమ ఓటు హక్కులను వినియోగించుకు న్నారు. మండలంలోని హర్కాపూర్ఆంధ్గూడ, ఈశ్వర్నగర్ పోలింగ్కేంద్రాల్లో ఈవీఎంలు గంట సేపు మొరాయించడంతో వాటిని మార్చి వేరే ఈవీ ఎంలను ఏర్పాటు చేశారు. మండలంలోని 42పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహించారు.