ఎదులాపురం, ఏప్రిల్ 30 : ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్ణణంలోని 12 కేంద్రాల్లో 4,820 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 4,768 మంది హాజరయ్యారు. 52 మంది గైర్హాజరయ్యారు. ఉదయం నుంచే అకాల వర్షంతో ఇబ్బంది పడుతున్న అభ్యర్థులకు ప్రత్యేకంగా పోలీసు వాహనాల్లో పరీక్షా కేంద్రాల వద్ద సకాలంలో విడిచిపెట్టారు.
12 కేంద్రాల పరిసరాలను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉండి విజయవంతంగా పరీక్ష పూర్తయ్యేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్.శ్రీనవాసరావు, సీ సమయ్ జాన్రావు, డీఎస్పీలు వీ ఉమేందర్, ఉమా మహేశ్వరరావు, పోతారం శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.