సూర్య భగవానుడు మండిపోతున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మూడు రోజుల క్రితం వరకు చల్లబడ్డ వాతావరణం.. ఒక్కసారిగా వేడెక్కింది. సోమవారం రాష్ట్రంలోనే నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
అత్యధికం 41.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఫలితంగా రహదారులు నిర్మానుష్యంగా మారుతుండగా.. ప్రజలు శీతల పానీయాలను సేవిస్తున్నారు.
– నిర్మల్ అర్బన్, మార్చి 25