ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాలకు గాను సోమవారం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్ 4, బోథ్ 1, నిర్మల్ 1, ముథోల్ 2,ఖానాపూర్ 1 నామినేషన్లు పడ్డాయి. ఖానాపూర్లో ఇక బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా జాదవ్ అనిల్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాహత్బాజ్పేయికి కుటుంబ సభ్యులతో కలిసి ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందించారు. – బోథ్, నవంబర్ 6
ఎదులాపురం/బోథ్/ఉట్నూర్/నిర్మల్ టౌన్/ ముథో ల్, నవంబర్ 6 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా ల్లోని ఐదు శాసనసభ నియోజకవర్గాలకు కలిపి 9 నామి నేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఆదిలా బాద్లో 4, ముథోల్లో 2, బోథ్, నిర్మల్, ఖానాపూర్ నియో జకవర్గాల్లో ఒకటి చొప్పున దాఖలయ్యాయి. ఆదిలా బాద్లో బీజేపీ నుంచి పాయల్ శంకర్, గాలిపెల్లి నాగన్న(స్వతంత్ర), ఎల్చార్వార్ సత్యనా రాయణ (బాలిరాజా పార్టీ), వటేకర్ సురేశ్ (యుగ తులసి పార్టీ), బోథ్లో అనిల్ జాదవ్(బీఆర్ఎస్ పార్టీ) నామినేషన్ దాఖలు చేశారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్పేయికి కుటుంబ సభ్యులతో కలిసి ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు నేరడిగొండలోని తన ఇంటిలో అనిల్ జాదవ్ దంపతులు నామినేషన్ పత్రాలతో పూజలు నిర్వహించారు. కాగా, బోథ్ నియోజ కవర్గం లో మూడు రోజుల్లో కలిపి దాఖలైన నామి నేషన్ ఇదే కావడం గమనార్హం. ఖానాపూర్ నియోజకవర్గంలో ఒకటి దాఖలైంది. సోమవారం స్వతంత్ర అభ్య ర్థిగా నేతావత్ రాజేందర్ ఉట్నూర్ ఆర్డీవో జీవాకర్రెడ్డికి తన నామినేషన్ పత్రా న్ని అందజేశారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. కాంగ్రె స్ పార్టీ అభ్యర్థి శ్రీహరిరావు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రత్నకల్యాణికి అందజేశారు. ముథోల్లో ఒక నామినేషన్ దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి కోమల్ రెడ్డి తెలిపారు. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ రెండు సెట్లు వేసినట్లు వివరించారు.