మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నిర్మల్లో పలు ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభం
లోకేశ్వరం, డిసెంబర్ 29 : రైతులను అన్ని విధాలా ఆదుకొని వారి సంక్షేమానికి విశేషంగా కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. లోకేశ్వరం మండలంలోని పుస్పూర్లో బుధవారం ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆ యన పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మం త్రి అల్లోల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతులకు వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి రైతు బంధు కింద పెట్టుబడిసాయం అందిస్తున్నారన్నారు. దీంతో రైతులకు ఎంతో మేలు కలుగుతున్నదని పేర్కొన్నారు. అనేక పథకాలు అమలు చేస్తున్నారని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా అందరి మన్ననలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజన్న, జడ్పీటీసీ లోలం కళావతి, ఎంపీటీసీ లింగాల నర్సన్న, సర్పంచ్ సంగెం నర్సన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, సోషల్ మీడియా కన్వీనర్ బండి ప్రశాంత్, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
శ్రీ విఠలేశ్వర ఆలయం ప్రారంభం..
పుస్పూర్లో దాతలు సంజు, విజయ్ సాయంతో గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ విఠలేశ్వర ఆలయాన్ని మంత్రి అల్లోల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పురాతన ఆలయాల పునరుద్ధరణకు విశేషంగా కృషిచేస్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి తమవంతుగా సహకరించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి, అభివృద్ధి పనులకు సహకరించాలని సూచించారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విఠలేశ్వర మందిర నిర్మాణం గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు రాజేశ్ బాబు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
మహాలక్ష్మి ఆలయ పనులు ప్రారంభం..
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 29 : నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ కాలనీలో శ్రీ మహాలక్ష్మి ఆలయ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ముం దుగా మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆలయం జిల్లాకే తలమానికమని పేర్కొన్నారు. పూర్తి రాతి కట్టడంతో నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణానికి సుమారు రూ.3 కోట్లు వెచ్చించనున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. పక్కనే ఉన్న ఐదు చేతుల పోచమ్మ, తాతాయి ఆలయాలను రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్నట్లు చెప్పారు. జిల్లాలో నిరాదరణకు గురైన ప్రతీ ఆలయంతో పాటు అదనంగా నూతన ఆలయాల నిర్మాణం చేపట్టామన్నారు. నియోజకవర్గంలో మొత్తం 600 ఆలయాలను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.
నందిగుండం ఆలయంలో పనులు..
పట్టణంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో రూ.1.50 కోట్ల నిధులతో మూడు ఆలయాల నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా రూ.50 లక్షలతో నిర్మించనున్న కాళికామాత ఆలయం, అలాగే రూ.50 లక్షలతో నందిగుండం దుర్గామాత ఆలయ గాలిగోపురం పనులను ప్రారంభించారు. మరో రూ.50 లక్షలతో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామని తెలిపారు.
బాబా రాందేవ్ పిర్ మందిర్ నిర్మాణానికి శంకుస్థాపన..
రాజస్థానీయుల ఆరాధ్య దైవం బాబా రాందేవ్ పిర్ మందిర్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. నందిగుండం క్షేత్ర ప్రదేశంలో వెయ్యి గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్నామని చెప్పారు. స్థలం మంజూరు కు కృషిచేసిన మంత్రికి రాజస్థానీయులు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, దేవరకోట ఆలయ చైర్మన్ లింగంపల్లి లక్ష్మీనర్స య్య, నందిగుండం ఆలయ అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, బిట్లింగ్ నవీన్, నాయకులు డీ శ్రీనివాస్, పద్మాకర్, ముత్యం రెడ్డి పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయ పనులు..
లక్ష్మణచాంద, డిసెంబర్ 29 : మండలంలోని రాచాపూర్లో రూ.32 లక్షలతో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించా రు. ముందుగా పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తుల కోరిక మేరకు సబ్స్టేషన్ మంజూరుచేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. డీసీసీబీ చైర్మన్ రఘునందన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ లక్ష్మణచాంద ఇన్చార్జి అల్లోల సురేందర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, సర్పంచ్ సాతం బొర్రవ్వ, ఎంపీటీసీ రమ, నాయకులు సాతం గంగారాం, అడ్వాల రమేశ్, ఈటెల శ్రీనివాస్, గుజ్జారి గణేశ్, జహీరొద్దీన్ పాల్గొన్నారు.