డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్
అపోహలపై అవగాహన కల్పిస్తున్న వైద్యసిబ్బంది
తాంసి, నవంబర్ 29: వ్యాక్సిన్తోనే కరోనా కట్టడి సాధ్యమని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. మండలంలోని ఘోట్కూరి గ్రామంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. గ్రామంలో 250 మంది వరకు వ్యాక్సిన్ వేసుకోక పోవడంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలుపై బడిన వారు ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్వో శ్రీకాంత్, డీఐవో విజయసారథి, మండల వైద్యాధికారి నర్మద, ఎంపీవో సుధీర్రెడ్డి, ఎన్ఎంలు సుగుణ, లక్ష్మి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరోగ్య ఉపకేంద్రం తనిఖీ
గుడిహత్నూర్, నవంబర్ 29: తోషం గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని మండల వైద్యాధికారి శ్రీనివాస్ తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. మొదటి, రెండవ డోస్ వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను వివరించి 20 మందికి టీకా వేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సర్పంచ్ సోయం దస్రు, ఎంపీటీసీ శగీర్ఖాన్, హెల్త్ సూపర్వైజర్ అన్నపూర్ణ, సిబ్బంది ఉన్నారు.
దంతన్పల్లిలో వ్యాక్సినేషన్ కేంద్రం
ఉట్నూర్ రూరల్, నవంబర్ 29: మండలంలోని దంతన్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు వాక్సిన్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శి, పాల్గొన్నారు.
సాంగిడిలో..
బేల, నవంబర్ 29 : సాంగిడి గ్రామంలో కొవిడ్ టీకా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుమన్బాయి మాట్లాడుతూ కరోనా మూడో దశతో ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు బాల్చందర్, మహేందర్, శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛందంగా ముందుకు రావాలి
బోథ్, నవంబర్ 29: కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు బీ శ్రీధర్రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని తాలూకా దవాఖానలో పట్నాపూర్ ఎంపీటీసీ జుగదిరావుతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నారు. గ్రామస్తులకు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. బోథ్, సొనాల దవాఖానలతో పాటు ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు.