ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర
తలమడుగు పోలీస్స్టేషన్ తనీఖీ
తలమడుగు, నవంబర్ 29 : తలమడుగు మండలం-మహారాష్ట్ర సరిహద్దులో ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులకు ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. తలమడుగు పోలీస్స్టేషన్ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నమోదైన కేసుల దర్యాప్తులో తలమడుగు పోలీసులు చురుకుగా వ్యవహరిస్తున్నారని, పోలీస్స్టేషన్ ప్రాంగణం ఆహ్లాదకరమైన వాతవరణంలో తీర్చిదిద్దారని అభినందించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులపై శ్రద్ధచూపాలని సూచించారు. గ్రామాల్లో గొడవలు సృష్టించే వారు, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్స్టేషన్లో రిసెప్షన్ సెంటర్ అత్యంత కీలకమైనదని, బాధితులకు బరోసా కలిగించేలా స్పందన ఉండాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముందుగా పోలీస్స్టేషన్కు వచ్చిన రాజేశ్చంద్రకు ఎస్ఐ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఇన్చార్జి ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, సీఐ పురుషోత్తం చారి, ఏఎస్ఐ ప్రవళిక, ఆదిలాబాద్ రూరల్ సీఐ స్రవంతి తదితరులు ఉన్నారు.