బోథ్, నవంబర్ 29: విద్యార్థుల గ్రేడింగ్ మెరుగు పడేలా చూడాలని బోథ్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు మునిందర్రాజు సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయులతో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలల్లోని చైల్డ్ ఇన్ఫో, ఎఫ్ఏ-1, ఏబీసీ పరీక్షల ఫలితాల వివరాలు, విద్యార్థుల హాజరు పరిశీలించారు. ఉపాధ్యాయులను గ్రూపులుగా విభజించి ఎస్ఏ-1 పరీక్ష ప్రశ్నపత్రాలు తయారు చేయించారు. సమావేశంలో సీఆర్పీ వెంకటరమణ, రావుల శంకర్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
తలమడుగు మండలంలో..
తలమడుగు, నవంబర్ 29: మండల కేంద్రంతో పాటు బరంపూర్, ఖోడద్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలని, మోను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. సమావేశాల్లో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్యాంసుందర్, మహేందర్ యాదవ్, కృష్ణకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎజెండాలను అమలు చేయాలి
సిరికొండ, నవంబర్ 29 : ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ ఎజెండాలను అమలు చేయాలని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణ ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. కాంప్లెక్స్ సెక్రటరీ నైతం జైతు, స్ట్రాంగ్ ఉపాధ్యాయుడు గంగాధర్ ఆధ్వర్యంలో నిష్ట, ఎఫ్ఏ-1, పాఠశాలలో స్వచ్ఛ భారత్, బోధన విధానం, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమయపాలన, పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో సీఆర్పీ రవీందర్, ఉపాధ్యాయులు గంగామణి, స్పప్న, రాము, ఓంకార్ పాల్గొన్నారు.