29 ఏండ్ల క్రితం కడెం సబ్ఇన్స్పెక్టర్గా రిపోర్టు చేశా..
ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగా..
ఆదివాసులకు పోలీస్శాఖ పరంగా అండగా ఉంటా..
అధికారులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకారం
డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తా..
బాధ్యతల స్వీకరణలో ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి
ఎదులాపురం, డిసెంబర్ 27 : ఆదిలాబాద్పై పూర్తి పట్టు ఉందని, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ డీపీవోలో ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర నుంచి బాధ్యతలు తీసుకున్న ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
29 ఏండ్ల క్రితం కడెం సబ్ ఇన్స్పెక్టర్గా రిపోర్టు చేశానని పేర్కొన్నారు. ఎస్ఐ నుంచి ఎస్పీగా అంచెలంచెలుగా ఎదిగానని, ఆదివాసులకు పోలీ స్శాఖ పరంగా అండగా ఉంటానని పేర్కొ న్నారు. అధికారులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకా రం అందిస్తానని, డిపార్ట్మెంట్కు మం చి పేరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఎస్పీకి ఘన స్వాగతం
అదనపు ఎస్పీ హర్షవర్ధన్ నూతన ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగ తం పలికారు. తర్వాత అదనపు ఎస్పీలు, డీఎస్పీ లు, పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయికి
1991 బ్యాచ్కు చెందిన ఆయన ప్రొబేషనరీ ఎస్ఐగా ఉట్నూర్లో పని చేశారు. కడెం ఎస్ఐగా మొదటి పోస్టింగ్. ఆ తర్వాత ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలోనే 15 ఏళ్లు పనిచేశారు. కడెం, బెల్లంపల్లిలో ఎస్ఐగా పని చేసిన సమయంలో మావోయిస్టులను నిరోధించారు. తర్వాత సీఐగా పదోన్నతి లభించింది. భైంసా, ఖానాపూర్, నిర్మ ల్, తాండూర్ నుంచి మధ్యలో గోదావరిఖని వన్ టౌన్లో పనిచేశారు. 2009లో డీఎస్పీ పదోన్నతి పొంది కామారెడ్డి, గోదావరిఖని, హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీపీగా, సైబరాబాద్ అడిషనల్ డీసీపీ(కైమ్)గా పనిచేశారు. 2018లో కొత్తగూ డెం ఓఎస్డీగా నియమితులయ్యారు. అక్కడి నుం చి మంచిర్యాల డీసీపీగా బదిలీ అయి ఇప్పటి వరకు పనిచేశారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు.