కొనసాగుతున్న బ్యాగ్ ఫిల్లింగ్ పనులు
పర్యవేక్షిస్తున్న అధికారులు
లక్ష్యానికి అనుగుణంగా కసరత్తు
బోథ్/ నార్నూర్, డిసెంబర్ 27;ఎనిమిదో విడుత హరితహారానికి మొక్కలు సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో ఇందుకు అనుగుణంగా కూలీలతో పనులు చేపడుతున్నది. ప్రస్తుతం బ్యాగ్ ఫిల్లింగ్, ఎరువులు సిద్ధం చేసే పనులు నిర్వహిస్తున్నది. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మొక్కలనే సిద్ధం చేస్తుండగా, వచ్చే వానకాలం నాటికి వీటిని సిద్ధం చేయాలని యోచిస్తున్నది.
బోథ్ మండలంలో..
బోథ్ మండలంలోని 33 జీపీల్లో నర్సరీలను ఏర్పాటు చేశా రు. 3.70 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. ప్రతి నర్సరీలో 10 వేల నుంచి 11 వేల మొక్కలు పెంచను న్నారు. ఇందుకోసం జీపీలో 10+1 బెడ్లను సిద్ధం చేస్తున్నారు. నల్లమట్టి, ఎర్రమట్టిని సేకరించి పశువుల ఎరువుతో మిళితం చేసి శుభ్రం చేస్తున్నారు. శుభ్రం చేసిన మట్టికి సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువును కలిపి పాలిథిన్ బ్యాగుల్లో నింపుతున్నారు. నిమ్మ, దానిమ్మ, జామ, వెదురు, టేకు, పూల రకాలైన మల్లె, గులాబీ, మందార తదితర మొక్కలు, విత్తనాలు బ్యాగ్ ఫిల్లింగ్చేసిన కవర్లలో వేయనున్నారు. టేకు పెంపకం చేపట్టే కవర్లలో మాత్రం టేకు స్టంట్లు విత్తనున్నారు. ఎంపీడీవో రాథోడ్ రాధతో పాటు ఉపాధి హామీ ఏపీవో శ్యాంకుమార్ ఎప్పటికప్పుడు నర్సరీలను సందర్శిస్తూ అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. వచ్చే జూలై మాసంలో చేపట్టనున్న హరితహారం కోసం 33 పంచాయతీల్లో నాటేందుకు వీలుగా మొక్కలు అం దుబాటులో ఉంచేలా ప్రణాళికతో పనులు చేయిస్తున్నారు. ఆయా నర్సరీల్లో ఇందుకు అనుగుణంగా కూలీలతో సిబ్బంది పనులు చేయిస్తున్నారు.
నార్నూర్ మండలంలో..
నార్నూర్ మండలంలో మొక్కలు పెంచే పనులు శరవేగంగా సాగుతున్నాయి. గతేడాది వరకు అద్దె స్థలాల్లో నిర్వహించిన నర్సరీలను ప్రస్తుతం పంచాయతీల పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లోకి మార్చారు. నార్నూర్, గాదిగూడ మండలంలో మొ త్తం 48 గ్రామ పంచాయతీలకు గాను 7 పంచాయతీల్లో ఇప్పటికే ప్రభుత్వం స్థలాలు కేటాయించారు. 41 నర్సరీలు ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేశారు.
5లక్షల 28వేల మొక్కలు…
నార్నూర్, గాదిగూడ మండలంలోని 48 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో ఈ ఏడాది వివిధ రకాలకు చెందిన 5 లక్షల 28వేల మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బ్యా గుల్లో మట్టి నిండపం పూర్తయినట్లు తెలిపారు. ఈ దఫా మా త్రం ఆయా పంచాయతీల అవసరాల మేరకు.ప్రజల డిమాండ్ మేరకు మొక్కలను పెంచాలని అధికారులు సూచించినట్లు తెలిసింది. ప్రతి పంచాయతీలో 2వేల టేకు మొక్కలు కచ్చితంగా పెంచాలనే నిబంధన ఉంది. మొత్తం మొక్కల్లో 40శాతం గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా నాటాలి. మిగిలిన వాటిని ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు.
మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ
నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్ర త్యేక శ్రద్ధ పెట్టాం. మట్టి సేకరణతో పా టు, బ్యాగ్ ఫిల్లింగ్ పనులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇవి పూర్తి కాగానే స్టం ట్లు, విత్తనాలు వేసే పనులు చేయిస్తాం. ఇవి పూర్తయ్యక నీటిని అందించడం వంటి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. ప్రతి మొక్క వచ్చే హరితహారంలో నాటేందుకు వీలుగా సిద్ధం చేస్తాం.
-పీ శ్యాంకుమార్, ఈజీఎస్, ఏపీవో, బోథ్