స్వరాష్ట్రంలోనే మహనీయులకు గుర్తింపు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
ఘనంగా లక్ష్మణ్ బాపూజీ జయంతి
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్27 : స్వరాష్ట్ర సాధన కోసం తన రాజకీయ పదవిని వదులుకున్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ఉన్న కొండా విగ్రహానికి మంత్రి అల్లోల పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి అని, ఆసిఫాబాద్ నియోజకవర్గం తొలి శాసన సభ్యుడు, తెలంగాణ ఉద్యమంలో తన పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి అని కొనియాడారు. స్వరాష్ట్రంలోనే మహనీయుల జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్,బీసీ వెల్ఫేర్ అధికారి సుజయ్, కౌన్సిలర్లు నేరెళ్ల వేణు, బిట్లింగ్ నవీన్, ఎస్పీ రాజు, ఎడిపెల్లి నరేందర్, నాయకులు అడ్ప పోశెట్టి, ఆయా శాఖల అధికారులు, పద్మశాలీ సంఘ సభ్యులు రమణ, రమణ, రాజేశ్వర్, హరిదాసు, రమేశ్, యువజన సంఘ సభ్యులు, పోపా సంఘ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయం లో ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేశ్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాల యంలో చైర్మన్ ఈశ్వర్ ఆధ్వర్యంలో నివాళుల ర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్ పాల్గొన్నారు.
రాష్ట్ర కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ
ఎదులాపురం,సెప్టెంబర్27: తొలి, మలి దశ ఉద్యమాల్లో రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఉన్నారు. కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి రాజలింగం, కౌన్సిలర్లు బండారి సతీశ్, పవన్ నాయక్, ఆవుల వెంకన్న, మాజీ జడ్పీ చైర్మన్ చిట్యా ల సుహాసిని, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచి కట్ల ఆశమ్మ, నాయకులు శ్రీనివాస్, ప్రవీణ్, చిక్కాల దత్తు, రమేశ్, పార్థసారథి, రామ్కుమార్ పాల్గొన్నారు.